ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలోకి విజయశాంతి వెళ్లిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో కమలం గూటికి చేరిన ఆమె తాజాగా ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు చెప్పుకొచ్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం తాను రాజీపడకుండా పోరాడినట్లు స్పష్టం చేసింది.
కెసిఆర్ కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికి అమ్ముడుపోయినట్లు, కానీ తాను అలా చేయలేదని అలా చేసి ఉంటే నా రాజకీయ ప్రయాణం వేరేలా ఉండేది అని విజయశాంతి ఇంటర్వ్యూలో తెలిపింది. ఎక్కడా రాజీ పడకుండా, నా గురించి నేను ఏనాడు ఆలోచించలేదు నాకు నా తెలంగాణ ప్రజలు ముఖ్యమంటూ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా రాణించింది విజయశాంతి అంటూ తన గురించి తాను గొప్పగా చెప్పుకొచ్చింది.
ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది అని కాంగ్రెస్ పార్టీలో చేరితే అక్కడ శత్రువు పై పోరాడే పటిమ ఆ పార్టీలో లేదని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ కేసీఆర్ డైరెక్షన్ లో నడుస్తోంది అని స్పష్టం చేసింది. అంతమాత్రమే కాకుండా దుబ్బాక లో ఓటమి కి గల కారణం అధికార పార్టీతో కుమ్మక్కు అవటమే అని విజయశాంతి పేర్కొంది. శత్రువు తో ఒక అండర్ స్టాండింగ్ తో ఉంటే పార్టీ ఇంకా ఏమి పుంజుకుంటుంది అంటూ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేసింది విజయశాంతి. అందువల్లే బీజేపీలో చేరటం జరిగిందని, ప్రజలకు మేలు చేయడానికి ఎంతో బిజెపి కృషి చేస్తుందని, అధికార పార్టీతో డి అంటే డి అనే విధంగా కొట్లాడుతాకి రెడీగా ఉంది అంటూ విజయశాంతి స్పష్టం చేసింది.