ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇటీవలే స్వర్ణ ప్యాలెస్ ఘటనపై వరస ట్వీట్లు చేసిన విషయం తెల్సిందే. కొన్ని రోజుల క్రితం హీరో రామ్ ట్వీట్ చేస్తూ పెద్ద కుట్ర జరుగుతున్నట్లుంది. వైఎస్ జగన్ ను తప్పుగా చూపించడానికి కుట్రలు జరుగుతున్నాయి.
కొంత మంది ఆయనకు తెలియకుండా చేస్తోన్న పనుల వల్ల జగన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందని, వాళ్లపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా అని ట్వీట్ చేసారు. దాని తర్వాత రోజు అందరినీ ఫూల్స్ ను చేయడానికే విషయాన్ని ఫైర్ నుండి ఫీజు వైపు మళ్లిస్తున్నారంటూ పేర్కొన్నారు. స్వర్ణ ప్యాలెస్ ను మొదట ప్రభుత్వమే కోవిద్ సెంటర్ గా నిర్వహించిందని పేర్కొన్నారు రామ్. అయితే ఈ విషయాలపై ఇప్పుడు విజయవాడ సిటీ కమీషనర్ శ్రీనివాసులు సీరియస్ అయ్యారు. విచారణ ఎలా చేయాలో మాకు తెలుసు అంటూ ఆ ట్వీట్స్ పై మండిపడ్డారు.