గత కొన్ని రోజుల నుండి ఏపీ మీడియాలో విజయవాడ గ్యాంగ్ వార్ గురించి విస్తుపోయే కథనాలు ప్రసారమవుతున్నాయి. రెండు గ్రూపులు కలిసి యుద్ధానికి దిగినట్లు ఒకరి పై ఒకరు కత్తులతో దాడులు చేసుకోవడంతో ఈ ఘటనలో ఒకరు ప్రాణం కోల్పోవడం జరిగింది. మరికొంత మంది ఆసుపత్రి పాలయ్యారు. అయితే ఒక ల్యాండ్ విషయంలో సెటిల్మెంట్ చేయటానికి ఒక గ్రూప్ వస్తే మరొక గ్రూపు రావడంతో రెండు గ్రూపులు ఒకేసారి ఎదురు పడటంతో ఈ ఘటన జరిగినట్లు మొదట్లో వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విజయవాడ గ్యాంగ్ వార్ వెనుక పొలిటికల్ పార్టీ హస్తం ఉన్నట్లు విస్తుపోయే సీక్రెట్ బయటపడింది. రెండు గ్రూపులు కి ఏపీలో ప్రముఖ పార్టీల నాయకుల అండదండలు ఉన్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వారి ప్రోత్సాహం వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. జరిగిన ఈ ఘటన లో పాత నేరస్థులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సందీప్ మరియు పండు గ్రూపు లకు జరిగిన ఈ గ్యాంగ్ వార్ లో 45 మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు వారిని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
పోలీస్ విచారణలో కాల్ లిస్ట్ ప్రకారం కూడా విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా జరిగిన ఈ ఘటనలో చనిపోయిన సందీప్ భార్య తేజస్విని సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త హత్య వెనుక రాజకీయ నాయకుల ప్రోద్బలం ఉందని స్థానిక ఎన్నికల్లో కార్పొరేటర్ గా సందీప్ నిలబడే అవకాశం ఉండటంతో, గెలిచే అవకాశం ఉండటంతో తమ భర్త సందీప్ ని కొంత మంది రాజకీయ నాయకులు హత్య చేయించారని షాకింగ్ కామెంట్లు చేసింది.