Vijayawada News: విజయవాడ సమీపంలోని తాడేపల్లిలో నిన్న ఒక ఘోరం జరిగింది.. సీఎంక్యాంపు కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఓ యువతిపై దుండగులు అత్యాచారం చేసారు. ఈ ఘటన రాష్ట్రంలో ఇప్పుడు సంచలనంగా మారింది. పోలీసుల వైఫల్యంపై అన్ని సంఘాలు మండిపడుతున్నాయి. ఇది ఇలా ఉండగా.., విజయవాడ చిట్టి నగర్లో అమానవీయ ఘటన జరిగింది. ఓ నవజాతి శిశువుకి ఒళ్ళంతా చీమలు కుట్టి.. ఏడుస్తుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. చూసే వారిని, వినే వారికి కన్నీటిని రప్పిస్తున్న ఈ అమానవీయ ఘటన విజయవాడలో జరిగింది. చిట్టి నగర్ లో అప్పుడే పుట్టిన ఓ చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు నడి రోడ్డుపై వదిలి వెళ్లారు . ముక్కు పచ్చలారని ఆ చిన్నారిని చీమలు కుట్టాయి. గుక్క పెట్టి ఏడుస్తుండగా.. దారిన పోతున్న వారు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒళ్ళంతా చీమలు కుట్టి, ఎర్రగా కందిపోయి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ శిశువుని టూటౌన్ పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ శిశువు చికిత్స పొందుతున్నారు.. ఈ ఘటన విజయవాడ నగరంలో కొత్త సంస్కృతిని తెలియజేస్తుంది. మహా నగరంలో నడిరోడ్డుపై ఇలా జరగడంతో పోలీసులు ఆ శిశువుని ఎవరు వదిలి వెళ్లి ఉంటారా..!? అని సీసీ కెమెరాల పరిశీలనా ద్వారా ఆరా తీస్తున్నారు.