Vijayendra prasad : బాహుబలి రచయిత, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఏకంగా తన కొడుకు పాన్ ఇండియన్ డైరెక్టర్ రాజమౌళి మీదే సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుతో పాటు బాలీవుడ్, కోలివుడ్లో తెరకెక్కుతున్న భారీ చిత్రాలకి కథ అందిస్తున్నారు విజయేంద్ర ప్రసాద్. ఆయన కథ పాన్ ఇండియన్ స్థాయిలో సక్సెస్ అవుతోంది. బాహుబలి తర్వాత విజయేంద్ర ప్రసాద్ పేరు కూడా మారిపోయింది. బాలీవుడ్ అనుకుంటే ఏకంగా హాలీవుడ్ సినిమాలకి కూడా కథ రాయగల సత్తా ఉన్న రచయితగా ప్రఖ్యాతలు పొందారు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన భజరంగీ భాయిజాన్ ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.
అలాగే కంగన రనౌత్ నటించిన మణికర్ణిక, ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్, కోలీవుడ్ లో రూపొందిన బయోపిక్ తలైవి లాంటి గొప్ప చిత్రాలను అందిస్తున్నారు. అయితే పాన్ ఇండియన్ క్రేజ్ ఉన్న కొడుకు రాజమౌళి కంటే మరో దర్శకుడు తనకి ఫేవరేట్ అని చెప్పుకొచ్చారు. ఆ దర్శకుడే పూరి జగన్నాథ్. అంతేకాదు రాజమౌళి ఒక విషయంలో చాలా బలహీనంగా ఉంటాడని అన్నారు. సినిమా తీసే విషయంలో రాజమౌళి ని మించిన వారు లేరు. అయినప్పటికీ ఒక విషయంలో
మాత్రం బలహీనంగా కనబడుతాడు. అదే సినిమాల మేకింగ్. ఒక్కో సినిమాకు చాలా సమయం తీసుకుంటాడు రాజమౌళి అని వ్యాఖ్యలు చేశారు.
Vijayendra prasad : పూరి జగన్నాథ్ లో నాకు నచ్చే లక్షణం అదే అన్నారు.
ఈ విషయంలో ఎన్నోసార్లు చెప్పి విసిగిపోయానని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. అంతేకాదు ఈ విషయంలో సుకుమార్ కూడా అంతే. సినిమాను అద్భుతంగా తీస్తాడు. కానీ చాలా సమయం తీసుకుంటాడని అన్నారు. టాలీవుడ్ లో స్పీడ్ గా సినిమాలు తీయాలంటే పూరి జగన్నాథ్ తర్వాతే ఎవరైనా అని అభిప్రాయపడ్దారు. పూరి జగన్నాథ్ లో నాకు నచ్చే లక్షణం అదే అన్నారు. పూరి చిన్న సీన్ లో కూడా ఫైట్ సీన్ ను పెట్టగలిగిన సమర్థులు. ఆయన ఏ సీన్స్ తీసిన ప్రేక్షకులు ఇన్వాల్వ్ అవుతారని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.