Big Breaking: విజయనగరం జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని పూసపాటిరేగ మండలం చౌడువాడ గ్రామంలో యువతి పై పెట్రోల్ పోసి యువకుడు నిప్పంటించాడు. ఈ సమయంలో యువతీ అక్క అడ్డుకోవడానికి రాగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో ఆమె కుమారుడు కూడా గాయాలు అయ్యాయి. దీంతో ముగ్గురు బాధితులను విజయనగరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు నరవకు చెందిన యువకుడు గా గుర్తించారు.
ఇటీవలే సదరు యువతితో వివాహం కుదుర్చుకున్న యువకుడు… ఆమెపై అనుమానం తో ఫోన్ లో మరో యువకుడితో మాట్లాడుతున్నట్లు అనుమానించి పెళ్లి రద్దు చేసుకున్నాడు. ఈ క్రమంలో పోలీసులు రెండు కుటుంబాలను గతంలో రాజీకి గెలవడం జరిగింది. ఆ సమయంలో పోలీసులు యువకుడికి కౌన్సిలింగ్ ఇవ్వటంతో… తిరిగి వివాహానికి ఒప్పుకోవడం జరిగింది. అయితే ఇంతలోనే నిన్న రాత్రి.. మళ్లీ యువతిపై అనుమానించి ఏకంగా పెట్రోల్ పోసి నిప్పంటించిన డంతో ఈ ఘటనలో యువతి అక్క ఆమె కుమారుడుకి కూడా గాయాలు కావడంతో ముగ్గురిని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో యువతి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలియజేశారు. తాజా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ స్టార్ట్ చేశారు.