వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం ని రాజధానిగా గుర్తిస్తూ చాలావరకు ఆ ప్రాంత బాధ్యతలను ముందు నుండి తాను నమ్మిన వ్యక్తి వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి కి కీలక బాధ్యతలు అప్పజెప్పడం అందరికీ తెలిసిందే. కాగా అప్పటినుండి విశాఖపట్టణంలో రాజధానికి సంబంధించి హంగులు ఆర్భాటాలు మరియు భవనాలు విషయంలో విజయసాయిరెడ్డి దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చక్క పెడుతున్నారు. ఎప్పటికప్పుడు విశాఖపట్టణం లో పరిస్థితులు ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్తున్నారు. ఈ తరుణంలో కొంతమంది విశాఖ రాజకీయ నాయకులకు విజయసాయిరెడ్డి పెత్తనం నచ్చటం లేదు అన్న వార్తలు ఎప్పటి నుండో వినపడుతున్నాయి.
పరిస్థితి ఇలా ఉండగా ఇటీవల విజయసాయి రెడ్డికి మరియు అవంతి శ్రీనివాస్ లకు వ్యతిరేకంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు అనుచరుడు నందకిషోర్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్టు రాజకీయవర్గాల్లో కలకలం సృష్టించడంతో ఘంటా అనుచరుడు నందకిషోర్ ని సిఐడి అధికారులు అరెస్టు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ విషయంలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా దిమ్మతిరిగిపోయే విషయాలు బయటపడ్డాయి. పూర్తి విషయంలోకి వెళ్తే ఓ కీలక నేత ఆధ్వర్యంలో అదికూడా విజయసాయిరెడ్డి పక్కనే ఉండే నాయకుడు పాత్ర ఇందులో ఉన్నట్టు తేలింది. అతను విశాఖ వాసి అని పార్టీ లో కీలక నాయకుడుగా వ్యవహరిస్తూ ఆడిటర్ గా కూడా రాణిస్తున్నారని వార్తలు వినబడుతున్నాయి. ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే విజయసాయిరెడ్డి ఒకానొక టైములో ఈ ఆడిటర్ ని అందరి ముందు తిట్టడంతో అప్పటి నుండి విజయ సాయి రెడ్డి మీద కక్ష పెట్టుకున్నాడట.
దీంతో పొలిటికల్ గా విజయసాయి రెడ్డికి డ్యామేజ్ చేయాలని ఆయనకి మరియు అవంతి శ్రీనివాస్ కి గొడవ పెట్టే గ్యాంగ్ కి ఈ ఆడిటర్ అనే వ్యక్తి సహాయం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఆడిటర్ కూడా విశాఖ పట్టణానికి చెందిన వ్యక్తి కావటంతో ఎక్కడి నుంచో నెల్లూరు నుండి వచ్చి విశాఖపట్టణంలో విజయసాయి రెడ్డి పెత్తనం చెలాయించడం నచ్చక… ప్రత్యర్థుల తో చేతులు కలిపి విజయసాయి రెడ్డి మీద ఈ విధంగా బురదజల్లే కార్యక్రమానికి తెగ పడ్డారట. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు వైసీపీ పార్టీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.