viral video : సాధారణంగా చిరు జల్లులు కురుస్తుంటే చిన్న పిల్లలు వర్షంలో తడుస్తూ ఆనందంతో కేరింతలు కొడుతుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయం. అయితే ఓ మహిళా ఫారెస్టు అధికారిణి అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షంలో చిందులు వేస్తూ కేరింతలు కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోకు తక్కువ సమయంలో లక్షా 80వేలకు పైగా వ్యూస్ రావడంతో పాటు నాలుగు వేలకు పైగా లైక్ లు వచ్చాయి. ఇంతకూ ఆ అధికారిణి వర్షంలో తడుస్తూ ఎందుకు చిందులు వేసిందో తెలుసుకోవాలని ఉంది కదా…
విషయంలోకి వెళితే… ఒడిశా రాష్ట్రంలోని సిమ్లిపాల్ నేషనల్ పార్క్, టైగర్ రిజర్వు ఫారెస్టులో నెల రోజులుగా మంటలు చెలరేగుతున్నాయి. ఈ మంటలను అదుపు చేసేందుకు అటవీ, అగ్నిమాపక శాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. దీంతో అటవీ సిబ్బందికి ఏమి చేయాలో తోచడం లేదు. అయితే ఆ సమయంలో ఉన్నట్టుండి వర్షం పడటంతో ఆ సమయంలో విధుల్లో ఉన్న మహిళా ఫారెస్టు అధికారిణి స్నేహా ధల్ వర్షంలో తడుస్తూ ఆనందంతో చిందులు వేసింది. ఆమె వర్షంలో చిందులు వేస్తున్న వీడియోను కిషోర్ మొహంత అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తక్కువ వ్యవధిలో లక్షా 80వేల మంది ఈ వీడియోను వీక్షించారు. అడవిని కాపాడుకున్నామన్న సంతోషంతో ఆమె చిందులు వేస్తుందంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. పర్యావరణం, విధుల పట్ల ఆమెలో అంకితభావం కనబడిందని కామెంట్స్ ఇస్తున్నారు.
మంటల్లో చిక్కుకుని కొద్ది రోజులుగా కాలిపోతున్న అడవిని వరుణుడు కాపాడాడని నెటిజన్ లు పేర్కొంటున్నారు. వృక్ష సంపదను కాపాడుకునే క్రమంలో విఫలమైన తమకు దేవుడు వర్షం రూపంలో వచ్చి సాయం చేశాడంటూ ఆ అధికారిణి పెద్దగా కేకలు వేస్తూ చిందులు వేసింది.
Such rains are like helping hands of God. One can see the happiness of lady forester involved in firefighting in Similipal, Odisha. Good news is that fire is under control as per the current MODIS satellite data.
Via @ykmohanta pic.twitter.com/6RVagrCxQz— Ramesh Pandey (@rameshpandeyifs) March 10, 2021