Viral Video : ఒక ఇంటికి ఏదైనా సమస్య వస్తే దాన్ని తీర్చే బాధ్యత కుటుంబ పెద్ద స్వీకరిస్తాడు.. తాజాగా తన భార్య , కూతురిని కాపాడుకునేందుకు ఒక వ్యక్తి ఏకంగా చిరుతపులి తో పోరాడాడు.. చిరుత పై చిరుతల మారాడు.. పులి పైనే తన పంజా విసిరాడు.. సోషల్ మీడియా లో ఈ వీడియో వైరల్ అవుతోంది.. దీనిపై నెటిజెన్స్ అతని ధైర్య సాహసాలను కొనియాడుతున్నారు..
వివరాల్లోకి వెళితే.. ఈ సంఘటన కర్ణాటకలోని హసన్ జిల్లా హరిసెక్రే తాలూకా బెండ క్రె ప్రాంతంలో జరిగింది రాజు గోపాల్ నాయక్ తన భార్య , కూతురి తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఒక్కసారిగా వారి పై చిరుత పులి దాడి చేసింది.. ఈ నేపథ్యం లో ముగ్గురు బైక్ మీద నుంచి కింద పడిపోయారు.. దాంతో చిరుత వారిపై దాడి చేసింది.. చిరుత నుండి ఇ తన భార్యను కూతురిని రక్షించుకోవడానికి రాజగోపాల్ నాయక్ వీరోచిత పోరాటం చేశాడు తన ప్రాణాలకు సైతం తెగించి చివరికి చిరుత నే చంపి తమ ప్రాణాలను రక్షించుకున్నాడు.. తన కుటుంబం జోలికొస్తే నాయక్ ఏకంగా కులికే పంజా విసిరి వీరుడిలా పోరాడాడు..అప్పటికే పులి దాడిలో తీవ్రంగా గాయపడిన అతని భార్య , కుమార్ తో సహా రాజగోపాల్ను స్థానికులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు.