Viral Video : కాలం మనిషిని ఎటు తీసుకెళ్తుందో చెప్పలేం.. మనిషి కలలు కన్నా ప్రపంచాన్ని ఒక్కసారిగా చిదిమేస్తోంది.. ముంబాయికి చెందిన దేశ్ రాజ్ అనే 74 సంవత్సరాలు వయసున్న వ్యక్తికి తోడుగా నిలవాల్సిన కొడుకుని కాలం తన పొట్ట పెట్టుకుంది.. ఈ వయసులో తన మనవరాలి కోసం ఎవరూ చేయని సాహసం చేశాడు..
ముంబైకి చెందిన ఆటో డ్రైవర్ దేశ్ రాజ్ తన జీవితాంతం తన పిల్లల కోసం కష్టపడ్డాడు. పిల్లలకు పెళ్లిళ్లు చేశాడు.. మనవరాళ్లుతో హాయిగా జీవించాలనుకున్నాడు. కానీ కాలం కన్నెర్ర చేసింది. తన ఆలనా పాలనా చూసుకుంటాడునుకున్న కొడుకు మరణించాడు. దీంతో తన మనవరాళ్ల బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. ఈ వయసులో కూడా తను ఆటో నడుపుతూ వారిని చదివిస్తున్నాడు. తన మనవరాలు ఇంటర్లో 80 శాతం మార్కులతో తాత కష్టానికి తగ్గ ఫలితాన్ని సాధించింది. మంచి మార్కులతో పాసైన తన మనవరాలిని మరింత ఉన్నత చదువులు చదివించడానికి తగినంత డబ్బులు లేకపోవడంతో, ఏకంగా తను ఉంటున్న ఇంటిని అమ్మేశాడు. వచ్చిన డబ్బుతో ఫీజు కట్టేసాడు. అందరిని బంధువుల ఇంటికి పంపించి, తాను మాత్రం ముంబై లోనే ఉంటూ ఆటోని ఇల్లుగా చేసుకుని జీవనం సాగిస్తున్నాడు . ప్రస్తుతం తన మనవరాలు ఢిల్లీలో చదువుకుంటోంది . తన మనవరాలు ఎప్పుడు టీచర్ అవుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నాడు తాత.
‘హ్యూమన్ ఆఫ్ బాంబే’ దేశ్ రాజ్ కథ ను సోషల్ మీడియా లో పోస్ట్ చేయడంతో అతని కదా వైరల్ అవుతోంది.. దీన్ని చూసి చలించిపోయిన చాలా మంది దాతలు ఉదారంగా విరాళాలు ఇచ్చారు. మొత్తం 24 లక్షలు వచ్చాయి . హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఇటీవల తనకు 24 లక్షల చెక్కును అందజేసింది. ఇందులో పది లక్షలు పిల్లల చదువుకు, మరో పది లక్షలు ఇంటికి, మిగతా సొమ్ము ఇతర అవసరాలకు ఉపయోగపడేలా ఉపయోగించుకుంటామని ఆయన చెప్పారు. దేశ్ రాజ్ తన కన్నీళ్ళతోనే నెటిజన్లు చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపాడు. మనవరాలిని చదివించాలన్న కోరికే, దేశ్ రాజ్ ని 70 ఏళ్ళ వయసులో కూడా రియల్ హీరో గా చేసింది..
https://www.instagram.com/p/CLmFEz0F_OD/?utm_source=ig_web_copy_link