రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి బంతికి ఉమ్మి రాయబోయి వెంటనే ఆగిపోయాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లి కొంచెం ఉంటే ఐసీసీ విధించిన కోవిడ్ 19 ప్రోటోకాల్ను ఉల్లంఘించేవాడే. కానీ చివరి క్షణంలో తాను చేస్తున్న తప్పును తెలుసుకుని వెంటనే బంతికి ఉమ్మి రాకుండా ఆగిపోయాడు.
ఢిల్లీ క్యాపిటల్స్తో తాజాగా జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లి షార్ట్ కవర్ ప్రాంతంలో ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ 3వ ఓవర్లో 3వ బంతిని నవదీప్ సైనీ వేయగా ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా షాట్ ఆడాడు. అయితే షార్ట్ కవర్స్లో ఉన్న కోహ్లి ఆ బంతిని పట్టుకున్నాడు. అనంతరం ఆ బంతికి కోహ్లి ఉమ్మి రాయబోయాడు. చేతికి ఉమ్మి రాసుకుని బంతికి అప్లై చేయబోయి వెంటనే ఆగిపోయాడు. కోవిడ్ నేపథ్యంలో బౌలర్లు బంతికి ఉమ్మిరాయడాన్ని ఐసీసీ నిషేధించింది. అయితే ఆ విషయం గుర్తుకు రాగానే వెంటనే అతను ఉమ్మి రాయడం మానేశాడు. తాను తప్పు తెలుసుకున్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. కాగా ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
https://youtu.be/U7-uBIpeVhM
ఇక ఇటీవలే రాజస్థాన్ ప్లేయర్ రాబిన్ ఊతప్ప కూడా బంతికి ఉమ్మి రాశాడు. సాధారణంగా ఒక మ్యాచ్లో ఇన్నింగ్స్కు 2 సార్ల వరకు అంపైర్లు ఆ తప్పుకు ఎలాంటి శిక్ష వేయరు. కానీ అంతకు మించితే బ్యాటింగ్ జట్టుకు 5 రన్లను ఇస్తారు. బౌలింగ్ జట్టుకు అలా పెనాల్టీ పడుతుంది. కోవిడ్ నేపథ్యంలోనే ఐసీసీ ఈ రూల్ను అమలు చేస్తోంది. అయితే ప్లేయర్ ఎవరైనా బంతికి ఉమ్మి రాస్తే వెంటనే ఆ బంతిని అంపైర్ తీసుకుని దాన్ని శుభ్రం చేసి ఇవ్వాల్సి ఉంటుంది. కరోనా పూర్తిగా అంతం అయ్యే వరకు ఐసీసీ ఈ ప్రత్యేక రూల్ను అమలు చేయనుంది.