భారత్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రి అయ్యాడు. జనవరి 11 వ తారీకు అనుష్క శర్మ ఆడ బిడ్డకు జన్మనివ్వడం జరిగింది. స్వయంగా ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ సోషల్ మీడియా ద్వారా తెలియజేసి తన ఆనందాన్ని భారత్ క్రికెట్ ప్రేమికుల తో పాటు తన అభిమానులతో పంచుకున్నాడు. “సరిగ్గా లాక్ డౌన్ సమయంలో ఆగస్టు 11 వ తారీకు విరాట్ కోహ్లీ మేము త్వరలో ముగ్గురం కాబోతున్నాము.
2021 జనవరిలో పండంటి బిడ్డ రాబోతోందని కోహ్లీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ క్రమంలో తాజాగా జనవరి 11 తారీకు ఈనాడు సోషల్ మీడియా ద్వారా ‘ఇవాళ మధ్యాహ్నం మాకు కూతురు పుట్టిందన్న విషయాన్ని మీతో పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు.
అనుష్క, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు, మా జీవితంలో ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సమయంలో మా ప్రైవసీని మీరంతా గౌరవిస్తారని ఆశిస్తూ.. ప్రేమతో మీ విరాట్’ అంటూ కోహ్లీ ఓ లెటర్ విడుదల చేశాడు. దీంతో కోహ్లీకి చాలామంది సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. విరాట్ కోహ్లీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ ఇద్దరు ఒక ప్రముఖ యాడ్ కంపెనీకి చెందిన షూటింగ్లో పాల్గొని, ఆ యాడ్ చేసిన సమయంలో ప్రేమలో పడటం జరిగింది. ఆ తర్వాత కొన్ని వార్తలు వచ్చినా గానీ పెద్దగా ఇద్దరు స్పందించలేదు కానీ ఒక్కసారిగా ఇద్దరు ఊహించని విధంగా పెళ్లి చేసుకోవటంతో అందరు షాక్ కు గురయ్యారు. అయితే తాజాగా ఈ జంటకు పాప పుట్టడంతో కోహ్లీ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలపటంతో.. కోహ్లీ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.