సిడ్ని(ఆస్ట్రేలియా), జనవరి 11: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలు సిడ్ని క్రికెట్ గ్రౌండ్ (ఎస్సిజి) గౌరవ సభ్యత్వాన్ని పొందారు. శుక్రవారం మ్యాచ్ ప్రారంభం సందర్భంగా గ్రౌండ్లో ఈ పురస్కారాన్ని నిర్వాహాకులు అందజేశారు. రవిశాస్త్రి ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు.
గతంలో భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, వెండీస్ జట్టు మాజీ కెప్టెన్ బ్రియాన్ లారాలు ఈ గౌరవాన్ని అందుకున్నారు.
ఈ గ్రౌండ్లో క్రికెట్కు సేవలందించినందుకు ఈ సభ్యత్వాన్ని అందజేశారు.
previous post
next post