Virata parvam : ఒక సినిమాలో టాలెంటెడ్ యాక్టర్లు ఉంటే దర్శకుడికి ఆ సినిమా కత్తి మీద సామే. ఎందుకంటే ఆ సినిమాలో ఎవరి పాత్రను ఎలా మలచాలి..ఏ స్థాయిలో చూపించాలి అనే ఆలోచనలో సతమవుతుంటాడు. అందుకే కథ అనుకున్నప్పుడే కొన్ని పాత్రలను మైండ్ లో స్ట్రాంగ్ గా ఫిక్సవుతాడు. ప్రాజెక్ట్ ఎంత ఆలస్యమైనా కూడా ఆయన అనుకున్న నటీ, నటులను సెలెక్ట్ చేసుకుంటాడు. డేట్స్ సర్దుబాటు కాకపోయినా కొన్ని నెలలు వెయిట్ చేయాల్సి వచ్చినా నిర్మాతలను కన్విన్స్ చేసి వాళ్ళ కోసం ఆగుతాడు. అలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకుంటాయి.
అలాంటి సినిమా ఒకటి త్వరలో రిలీజ్ కాబోతుంది. నీది నాది ఒకటే కథ..అనే సినిమాతో వేణు ఉడుగుల అనే టాలెంటెడ్ డైరెక్టర్ తెలుగు పరిశ్రమకి అడుగు పెట్టాడు. ఈ సినిమా రిలీజయ్యక అందరి నుంచి మంచి దర్శకుడు ఇండస్ట్రీకి వచ్చాడని చెప్పుకున్నారు. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల నుంచి సినిమాలకి దర్శకత్వం వహించే ఛాన్సులు దక్కించుకుంటున్నాడు. కాని తనకు బాగా నచ్చిన కథ విరాట పర్వం రూపొందించి రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో ఆయనకి ఎన్నో మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయట. అవన్ని సినిమా విడుదల కాగానే చెప్తానని అంటున్నాడు.
Virata parvam : పరిస్థితులు సర్దుకుంటే రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు.
అయితే ఇందులో రానా దగ్గుబాటి, సాయి పల్లవి, నేషనల్ అవార్డ్ గెలుచుకున్న ప్రియమణి ప్రధాన పాత్రలను పోషించారు. వీరు ముగ్గురు విరాట పర్వంలో బాగా పోటీ పడి నటించారట. నటన పరంగా ఒక్కొక్కరు ఎంత టాలెంట్ ఉన్నవాళ్ళో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరి పాత్రలు సినిమాలో ఎంతో అద్భుతంగా ఉంటాయట. చిత్రీకరణ సమయంలో కొన్ని కాంబినేషన్ సీన్స్ పోటాపోటీగా చేశారని తెలుస్తోంది. లాక్ డౌన్ కారణంగా రిలీజ్ అనుకున్న విరాట పర్వం బ్రేక్ పడి ప్రేక్షకుల ముందుకు రాలేకపోయింది. మరి పరిస్థితులు సర్దుకుంటే రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!