Virata Parvam-Vikram: కరోనా వచ్చిన తర్వాత ఓటీటీల హవా ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం థియేటర్స్లో విడుదలైన ప్రతి సినిమా.. మళ్లీ కొద్ది రోజులకే ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఇందులో భాగంగానే మరో రెండు చిత్రాలు ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. అందులో `విక్రమ్` ఒకటి కాగా.. `విరాట పర్వం` మరొకటి.
లోకనాయకుడు, తమిళ స్టార్ హీరో కమల్ హాసన్, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం `విక్రమ్`. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై నిర్మితమైన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య, అర్జున్ దాస్, శివానీ నారాయణన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
జూన్ 3న తెలుగు, తమిళ్ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అయిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. దీంతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ను వసూల్ చేసిన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. విక్రమ్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను సొంతం చేసుకున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. ఈ మూవీని జులై 8 నుండి స్ట్రీమిండ్ చేయబోతోంది.
అలాగే `విరాట పర్వం` విషయానికి వస్తే.. రానా దగ్గుబాటి, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రమిది. నక్సలిజం నేపధ్యంలో ఓ చక్కటి ప్రేమ కథగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూన్ 17న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా ప్రభావం చూపించలేకపోయింది. దీంతో లేట్ చేయకుండా ఈ మూవీని ఓటీటీలోకి దింపేస్తున్నారు. జూలై 1నుంచి నెట్ ఫ్లిక్స్ లో మూవీ స్ట్రీమింగ్ కానున్నది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews