విశాఖపట్నం: పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న తలంపుతో అరకు ఉత్సవాలకు సుమారు కోటి రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 29వ తేదీ నుండి రెండు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగు అరకు ఉత్సవాల్లకు సంబంధించిన పోస్టర్ ని నేడు మంత్రి అవంతి ఆవిష్కరించారు. ఈ ఉత్సవాల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్, గిరిజన కళల ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. పర్యాటక ప్రాంతాల్లో గిరిజన యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని వెల్లడించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యే శెట్టి పాల్గుణ, జాయింట్ కలెక్టర్ శివ శంకర్, టూరిజం అధికారులు పాల్గొన్నారు.
previous post
next post