దేశ వ్యాప్తంగా ముఖ్య నగరాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనితో కరోనా కట్టడికి ఆయా ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. నేటి వరకు దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షల 73 వేలకు చేరుకోగా 14,894మంది మృతి చెందారు. 2 లక్షల 71వేల మంది కోలుకున్నాను.
ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నాయి. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుడటం ప్రజలను ఆందోళన కల్గిస్తున్నది. ఏపీలో కరోనా కేసుల సంఖ్య పది వేలు దాటింది. గురువారం నాటికి ఏపీలో 10,331 మందికి కరోనా వైరస్ సోకగా 4,779 మంది కోలుకున్నారు. 124 మంది కరోనా వల్ల మృతి చెందారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ప్రజలకు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తోంది. అయితే చాలా ప్రాంతాలలో ప్రజలు ప్రభుత్వ సూచనలు బేఖాతరు చేస్తూ పనులు ఉన్నా లేకపోయినా రోడ్ల మీదకు వస్తున్నారు. వీరి విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇళ్ల నుండి బయటకు వచ్చే వారు విధిగా మాస్క్ లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని లేకపోతే జరిమానా లు వసూలు చేయాలని నిర్ణయించింది.
ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని విశాఖ పోలీసులు నిర్ణయించారు. నగరంలో ముఖానికి మాస్క్ లేకుండా ఎవరైనా కనిపిస్తే ఇకపై వారికి వంద రూపాయలు జరిమానా విధిస్తామని విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్ కె మీనా తెలిపారు. నియమాలు ఉల్లంఘించి కార్యక్రమాలు నిర్వహిస్తే వారిపై కేసులు కూడా నమోదు చేస్తామని అయన హెచ్చరించారు. ప్రజలు అధికారులు చెప్పిన సూచనలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.
మరో పక్క కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పలు జిల్లాల్లో లాక్ డౌన్ అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రకాశం, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాలలో లాక్ డౌన్ అమలుకు చర్యలు చేపట్టారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?