Vizag Steel Plant :విశాఖను రాజధానిగా చేయాలనుకుంటున్న వైసిపి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని తనకు అనువుగా మార్చుకునే ఎత్తుగడ వేసింది.
తద్వారా విశాఖకి ఈజీ షిఫ్ట్ ఓవర్ కి పావులు కదుపుతోంది.విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఫ్యాక్టరీని ప్రభుత్వమే తీసుకుంటుందని తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రజలకు సంబంధించిందన్నారు. స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయాలని చూస్తే ఏపీ ప్రభుత్వమే తీసుకునేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ బిడ్డింగ్ లో పాల్గొంటామని చెప్పారు.ప్రైవేటీకరణ చేయాలని చూస్తే ప్రభుత్వం తరపున ప్రపోజల్ వేస్తామన్నారు. ఉద్యమాల నుంచి స్టీల్ ఫ్యాక్టరీ పుట్టిందని..ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం చూస్తే ప్రభుత్వం తరపున బిడ్డింగ్ లో పాల్గొంటామని చెప్పారు. పునర్విభజన చట్టంలో కేంద్రం నుంచి ఏపీకి చాలా రావాల్సివుందని తెలిపారు.మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు పలు పార్టీలు, కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
Vizag Steel Plant : సరైన సమయంలో మోగిన ‘గంట’!
ఇక చాలా కాలంగా తన రాజకీయ భవిష్యత్తు విషయంలో డోలాయమానంలో ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఇదే అంశాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన టిడిపి నేత గంటా శ్రీనివాసరావు ప్రైవేటీకరణకు ఒప్పుకునే ప్రస్తకే లేదని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిశ్రమ కాదు…తెలుగు ప్రజల గుండె చప్పుడు అని అన్నారు. స్టీల్ ప్లాంట్ పై లక్షమందికి పైగా ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంటే మనిషి నుంచి తలను వేరు చేయడమే అవుతుందని పేర్కొన్నారు.పాలకులు ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే దాని రిప్రగేషన్స్, రియాక్షన్స్ దానికి సంబంధించిన ఫలితాలు ఏ విధంగా వస్తాయో గతంలో చాలా సార్లు చూశామని చెప్పారు. చలిని లెక్కచేయకుండా, రోడ్లపై పడుకుని రైతులు మొక్కవోని దీక్షతో పోరాటం కొనసాగిస్తున్నారని తెలిపారు. గతంలో తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం వచ్చింది..దానిపై ఎలా పోరాటం చేస్తున్నారో చూస్తున్నామని చెప్పారు. అలాగే ఇప్పుడు విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని కూడా ప్రజా ఉద్యమంగా మలుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేస్తున్నట్లు గంటా ప్రకటించారు. తాను మాటల మనిషిని కాదని.. చేతల మనిషినని గంటా తెలిపారు.