Vishnav Tej – Krish : ఉప్పెన తో ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ఈ ఒక్క సినిమా తోనే టాలీవుడ్ లో తన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.. దర్శకుడు క్రిష్, రకుల్ ప్రీత్, వైష్ణవ్ తేజ్ కాంబినేషన్ లో ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకి నిన్నమొన్నటి వరకు కొండపొలం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని టాక్.. తాజాగా ఈ సినిమాకి మరో టైటిల్ ని ఫిక్స్ చేశారని సమాచారం..
కరోనా లాక్ డౌన్ సమయం లోనే ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయింది. ఓ 40 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ సినిమాని వికారాబాద్ ఫారెస్ట్ లో ఎక్కువ శాతం చిత్రీకరించారు. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట్రామి రెడ్డి రాసిన పాపులర్ నవల కొండపొలం ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీ కి కొండ పొలం అనే పేరు ఫిక్స్ అయిందని టాక్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకి మరో టైటిల్ ఫిక్స్ అయినట్లు వినబడుతోంది.. ఈ చిత్రానికి “జంగిల్ బుక్ ” అనే టైటిల్ ను లాక్ చేసినట్లు తాజా సమాచారం. ఈ సినిమా పైన కూడా మంచి అంచనాలు ఉన్నాయి అభిమానుల్లో. ఈ సినిమా లో రకుల్ ప్రీత్ సింగ్ ఓబులమ్మ అనే పాత్రను చేసిందని టాక్.