Maa Elections: టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్టోబర్ 10వ తారీకు మా ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. “మా” అధ్యక్ష పదవి కోసం పలువురు పోటీ పడుతూ ఉన్నారు. ముఖ్యంగా విష్ణు వర్సెస్ ప్రకాష్ రాజ్ అనే టఫ్ ఫైట్ ఇండస్ట్రీలో ఏర్పడింది. “మా” అధ్యక్ష పదవి కోసం విష్ణు కీలకంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. మీడియా డిబేట్ లలో పాల్గొంటూ.. ప్యానల్ సభ్యులతో.. సమావేశాలు నిర్వహిస్తూ… ప్రముఖుల మద్దతు కూడగట్టడానికి ప్రచారం లో దూసుకుపోతున్నరు. నిన్న నటసింహం బాలయ్య బాబు మద్దతు తనకే అని పేర్కొన్న విష్ణు ఈరోజు టాలీవుడ్ సీనియర్ యంగ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు తో భేటీ అయ్యారు.
కృష్ణంరాజు ఇంటికి వెళ్లి ఆశీస్సులు అందుకున్న విష్ణు
జరుగుతున్న “మా” అధ్యక్ష ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. కృష్ణంరాజు ఇంటికి వెళ్లి ఆయన ఆశీస్సులు అందుకున్న తర్వాత ఆయనతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు విష్ణు. ఈ సందర్భంగా రెబల్ స్టార్ నుండి ఆశీస్సులు అందాయి అన్నట్లు ఫోటోలో కామెంట్లు చేశారు. కచ్చితంగా జరగబోయే “మా” అధ్యక్ష ఎన్నికలలో గెలుస్తామన్న ధీమాతో మంచు విష్ణు రాణిస్తున్నారు. ఇక ఇదే సమయంలో.. ప్రకాష్ రాజు కూడా.. మరోపక్క ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నారు. మెగా కాంపౌండ్ హీరోల సపోర్ట్ తో పాటు పలువురు కీలక హీరోల సపోర్ట్ కూడా తీసుకోవడానికి విలక్షణ నటుడు.. ప్రకాష్ రాజ్… బిజీ బిజీగా గడుపుతున్నారు.
“మా”అధ్యక్షుడు నరేష్..విష్ణుకి మద్దతు…
ఇదిలా ఉంటే గత “మా”అధ్యక్షుడు నరేష్… తన మద్దతు విష్ణుకి ఉంటుందని.. చెప్పుకొచ్చారు. అధ్యక్ష ఎన్నికలలో..మా అసోసియేషన్ కి సంబంధించి బిల్డింగ్ అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు అసోసియేషన్ కి పర్మినెంట్ బిల్డింగ్ లేకపోవటాన్ని ఉద్దేశించి తీవ్రస్థాయిలో.. ప్రస్తుతం అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న వాళ్లు కామెంట్ చేస్తూ ఉన్నారు. దీంతో జరగబోయే ఈ “మా” అధ్యక్ష ఎన్నికలలో… తాము గెలిస్తే ఖచ్చితంగా బిల్లింగ్ కడతామని విష్ణు చెప్పుకొస్తున్నారు. మరి వచ్చే ఆదివారం జరగబోయే ఈమధ్య ఎన్నికలలో ఎవరు గెలుస్తారో చూడాలి.