మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి ( వివేకా) హత్య కేసులో అప్రూవర్ గా మారిన ఆయన మాజీ డైవర్ దస్తగిరి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసులో అప్రూవర్ గా మారిన తర్వాత తొండూరు మండలంలో కొందరు వైసీపీ నాయకులు తనను లక్ష్యంగా చేసుకుని వరుసగా కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. సోమవారం ఆయన కడప ఎస్పీ కార్యాలయానికి వచ్చి తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఉన్నపళంగా తనకు కేటాయించిన ఇద్దరు గన్ మెన్ లను ఎందుకు మార్చారని ప్రశ్నించారు. ఎస్పీని కలిసిన అనంతరం ఆయన మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు.
తనకు భద్రత కల్పించాలని కడప ఎస్పీని కోరినట్లు దస్తగిరి చెప్పారు. సీబీఐ ఎఎస్పీ రాం సింగ్ సూచనల మేరకే తాను ఎస్పీ కార్యాలయానికి వచ్చానని తెలిపారు. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గన్ మెన్ లను మార్చారని ఆరోపించాడు. తన ప్రాణానికి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో సరైన భద్రత కల్పించాలని ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన దస్తగిరి .. తన ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే సీ ఎం జగన్ బాధ్యత వహించాలని పేర్కొన్నాడు.
మరో పక్క దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని ఉమాశంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలు సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను సోమవారం సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని సహ నిందితులైన వారు ఎలా ఛాలెంజ్ చేస్తారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.
Russia-Ukraine War: రాజధాని కైవ్ సహా ఉక్రెయిన్ నగరాలపై క్లిపణుల వర్షం కురిపిస్తున్న రష్యా..