Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆ హత్యకు కారకులు ఎవరు.. చేయించింది ఎవరు..చేసింది ఎవరు…ఎందుకు చేశారు అనేది సీబీఐ దర్యాప్తులో తేలిపోయింది. ఇన్నాళ్లూ సీబీఐ దర్యాప్తు తీరుపై అనేక అనుమానాలు వస్తూ వచ్చాయి. అసలు ఈ సునీల్ కుమార్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి లకు వివేకా హత్య కేసుకు సంబంధం ఏమిటి, అసలు పెద్ద వ్యక్తులను వదలివేసి చిన్న వ్యక్తులను విచారణ చేసి అరెస్టు చేశారేమోనని అనుమానాలు రేకెత్తాయి. అయితే ఈ హత్య కేసులో పాలుపంచుకున్న వివేకా డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారిపోయి న్యాయమూర్తి సమక్షంలో ఇచ్చిన వ్యాంగ్మూలం బయటకు రావడంతో వాస్తవాలు ఏమిటి అనేది ప్రజలకు కళ్లకు కట్టినట్లు తేలిపోయింది.
Viveka Murder Case: ఎర్ర గంగిరెడ్డికి బిగుసుకున్న ఉచ్చు
అయితే ఈ హత్య కేసులో తొలి నుండి అనుమానపడినట్లు వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డి తదితరుల పేర్లు దస్తగిరి ఇచ్చిన కన్ఫెక్షన్ స్టెట్మెంట్ లో వచ్చినప్పటికీ ఈ హత్య లో నేరుగా వారు సూత్రధారులు అన్నట్లుగా లేదు. ఎర్ర గంగిరెడ్డే ఈ హత్యకు సూత్రధారి అని, రూ.40 కోట్ల సుపారీతో ఈ హత్య జరిగినట్లు దస్తగిరి వ్యాంగ్మూలంలో పేర్కొన్నాడు. సునీల్ కుమార్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, గంగిరెడ్డితో సహా తాను హత్యలో ప్రత్యక్షంగా ఇన్వాల్ అయ్యామనీ, ఘటనకు ఒక రోజు ముందు వివేకా కు చెందిన కుక్కను సునీల్ కుమార్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డిలు కారుతో ఢీకొట్టించి చంపారనీ, ఘటన జరిగిన రోజు తాము వివేకా ఇంటి ప్రహరీగోడ దూకి లోపలకు వెళ్లగా అప్పటికే లోపల ఉన్న గంగిరెడ్డి తలుపు తీశారని పూసగుచ్చినట్లు వెల్లడించాడు దస్తగిరి.
గంగిరెడ్డి నేరం అంగీకరిస్తాడా..?
అయితే దస్తగిరి స్టేట్ మెంట్ ఆధారంగా సీబీఐ అధికారులు ఈ హత్యలో ప్రధాన సూత్రధారిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డిని విచారణ చేస్తే ఈ హత్యలో మొత్తానికి అతనే కారకుడా లేక ఇంకా తెరవెనుక ఎవరైనా ఉన్నారా అనేది తేలనున్నది. అయితే బెంగళూరు భూ వివాదం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో వివేకా ధూషణ, బెదిరింపుల కారణంగానే కక్ష పెంచుకుని తానే ఈ హత్యకు తెరతీశామని గంగిరెడ్డి స్టేట్ మెంట్ ఇస్తే ఈ కేసు దర్యాప్తు ఇంతటితో ఆగిపోతుంది. అయితే సీబీఐ అధికారులకు ఇప్పుడే అసలైన పరీక్ష మొదలు అవుతోంది. దస్తగిరి చెప్పినట్లుగా ఇతర నిందితులు అదే విధంగా స్టేట్ మెంట్ లు ఇవ్వడంతో పాటు గంగిరెడ్డి కూడా తానే పూర్తి బాధ్యుడినని ఒప్పుకుంటే కేసు తేలిపోయినట్లే. అలా కాకుండా వారు వేరే విధంగా వ్యాంగ్మూలాలు ఇస్తే కేసు దర్యాప్తు మరి కొంత కాలం సాగే అవకాశం ఉంటుంది. చూడాలి ఏమి జరుగుతుందో.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?