ఐపీఎల్ 2020కు మార్గం క్లియర్ అయిందని అనుకొనేలోపుగానే ఇప్పుడొక అవాంతరం వచ్చి పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ స్పాన్సర్ గా ఉంటూ వస్తోన్న మొబైల్ బ్రాండ్ వివో ఇప్పుడు స్పాన్సర్ గా కొనసాగకూడదని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రెండు రోజుల క్రితం జరిగిన బీసీసీఐ మీటింగ్ లో ఐపీఎల్ స్పాన్సర్లను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో చైనా బ్రాండ్స్ అయినప్పటికీ వివోతో పాటు డ్రీమ్ 11, పేటిఎం కూడా స్పాన్సర్స్ గా కొనసాగుతాయని భావించారు. అయితే ఇండియా – చైనా బోర్డర్ మధ్య ఉద్రిక్తల కారణంగా వివో స్పాన్సర్ షిప్ డీల్ నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 19 నుండి యూఏఈలో ఐపీఎల్ 13వ ఎడిషన్ మొదలుకానుంది. నవంబర్ 10న జరిగే ఫైనల్స్ తో ఐపీఎల్ ముగుస్తుంది. యూఏఈలో మూడు స్టేడియాలను ఇప్పటికే కన్ఫర్మ్ చేసారు.