విశాఖపట్నం షిప్ యార్డ్ లో భారీ క్రేన్ ప్రమాదంలో 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. చాలా అనూహ్యంగా జరిగిన ఈ పరిణామం రాష్ట్ర ప్రజలందరికీ కలిచివేసింది. అసలే కరోనా మహమ్మారి తో పోరాడుతూ అవిరామంగా దాని నుండి తప్పించుకునేందుకు పాటుపడుతున్న జనాలకు వరుసగా నాలుగు నెలల్లో ..
విశాఖపట్నంలో నాలుగవ ప్రమాదం జరగడం నిజంగా భయభ్రాంతులకు గురి చేస్తుంది. అసలే రోజులు బాగోలేని సమయంలో ఈ ఘటన ప్రజలందరూ రానున్న రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది.ఇకపోతే నిన్న జరిగిన ఘోరమైన ఘటనలో మృతి చెందిన తన అల్లుడిని చూసేందుకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఖరగ్ పూర్ నుండి నాగమణి మరియు ఆమె కుమారులు, ఇద్దరు కోడళ్ళు బయలుదేరారు.
విశాఖ బయలుదేరిన వారు శ్రీకాకుళం జిల్లా జలంతర కోట వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీకొట్టడం జరిగింది. ఆ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు నాగమణి మృతి చెందాడు. సోంపేట ప్రభుత్వాసుపత్రిలో గాయపడ్డవారిని అప్పటికప్పుడు వెళ్లి జాయిన్ చేయడం జరిగింది.నాగమణి తో పాటు డ్రైవర్ అక్కడికక్కడే చనిపోగా… ఈశ్వరరావు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
నాగమణి కోడలు లావణ్య కూడా ఈ ప్రమాదంలో మృతి చెందింది. మిగతావారు స్వల్ప గాయాలతో బయటపడ్డట్టుగా తెలుస్తోంది ఎంతైనా మృత్యువు కబళిస్తే అది కరోనా కావచ్చు, వైజాగ్ పరిశ్రమ కావచ్చు, ఆగి ఉన్న లారీని కావచ్చు లేదా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఏర్పరిచ్ఇన భారీ క్రేన్ కావచ్చు… దానిని ఎవరూ ఆపలేరు. కాబట్టి ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనించుకుంటూ అప్రమత్తంగా ఉండటం మంచిది.