విశాఖపట్నంలో పరిపాలన రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాయిదా వేసింది. అసలైతే ఆగష్టు 16న ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది కానీ కోర్టులో రాజధాని అంశమై పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అందుకే శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆగష్టు 16కు బదులుగా దసరా రోజుకు వాయిదా వేసింది.
అప్పటికైతే రాజధాని విషయంలో నెలకొన్న కేసులు, గందరగోళాలు పరిష్కారమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. దసరా రోజున శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధానమంత్రి మోదీని ఆహ్వానించడానికి ప్రధానమంత్రి కార్యాలయాన్ని అపాయింట్మెంట్ కోరింది. ప్రత్యక్షంగా కానీ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా కానీ శంకుస్థాపన జరిపించాలని కోరనుంది. అయితే ఆగష్టు 16 నుండే ఒక్కొక్క కార్యాలయం విడతల వారీగా తరలి వెళతాయని అందరూ భావించారు. పంద్రాగస్టు వేడుకలు జరుగుతాయని అనుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రయత్నాలు వాయిదా పడింది.