Vizag Steel Plant : ఇప్పుడంటే వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై రోజుకొక వార్త వస్తుంది కానీ అందరికంటే ఈ విషయంపై ముందు స్పందించిన లీడర్ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఈ టీడీపీ సీనియర్ నేత విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. అంతే…. ఒక్క దెబ్బకి అధికార ప్రతిపక్షాలు డిఫెన్స్ లో పడ్డాయి. ఏపీ బిజెపి వారు వెంటనే దీనికి స్పందించి కేంద్రం ఇంకా ప్రకటన చేయలేదు అని చెప్పినప్పటికీ గంటా శ్రీనివాసరావు మాత్రం తన రాజీనామాను స్పీకర్ కు సమర్పించేశాడు. ఆ తర్వాత జగన్ కేంద్రానికి లేఖ రాయడం కేంద్రం పెద్దగా పట్టించుకోకపోవడం కూడా జరిగింది.
Vizag Steel Plant : ఇదంతా గేమేనా…?
మొత్తానికి గంటా శ్రీనివాసరావు స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా చేసి ఉక్కు కర్మాగారం కోసం తన పదవిని త్యాగం చేసినట్లుగా ప్రకటించారు. ఆతర్వాత నిదానంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను, బీజేపీ లీడర్లను కూడా ఈ ఊబిలోకి లాగే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏకంగా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి అతను నేరుగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇవి చూసి గంటా శ్రీనివాస రావు ఏదో పెద్ద గేమే ఆడుతున్నారని పలువురు అభిప్రాయపడ్డారు. ఇక ఈ విషయమై ఇప్పటికే అనేక విమర్శలు వచ్చాయి.
విష్ణు కుమార్ ఏమంటున్నాడంటే…
దీనిపై బోలెడు విమర్శలు వచ్చినా ఆయన రాజీనామా కట్టుకథ అని అన్నా… ఎంతమంది ఎన్నిరకాలుగా మాట్లాడినా గంటా మాత్రం తన నిర్ణయానికి కట్టుబడి స్పీకర్కు రాజీనామా పంపించారు. అయితే గంట రాజీనామా కేవలం జనాలను మభ్యపెట్టే వ్యవహారమని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. గంటా మొత్తం 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉంటారని విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన శ్రీనివాసరావు గారు ఎన్నిసార్లు రాజీనామా చేసినా కూడా అక్కడ ఆమోదం పొందదు అంటూ బాంబు పేల్చాడు.
అప్పుడే రాజీనామా…?
అయితే గంటా రాజీనామా స్థానిక ఎన్నికల తర్వాత మొదలవుతుందని అప్పుడు ఆయన పార్టీ మారతారని విష్ణుకుమార్ రాజు అంటున్నారు. అంతే కాకుండా నేరుగా వైసీపీలోకి చేరేందుకే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంశాన్ని వాడుకున్నారని సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. ఇక ఇన్ని రోజులు తనకు నచ్చినట్లు జరుగుతున్న గేమ్ లోకి విష్ణుకుమార్ రాజు వచ్చి ఒక్కసారిగా ఇలా సంచలన వ్యాఖ్యలు చేసేసరికి గంటా మళ్లీ స్పందించాల్సి రావచ్చు. మరి దీనిపై గంటా స్పందన ఎలా ఉంటుందో చూడాలి….