Vizag Steel Plant : గత కొన్ని రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వైజాగ్ స్టీల్ ప్లాంట్ Vizag Steel Plant ప్రైవేటీకరణ విషయం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రుల ఆత్మ గౌరవం అంటూ ప్రధాన పార్టీల నాయకులు ఈ విషయంలో తీవ్ర స్థాయిలో కేంద్రం తీసుకున్న నిర్ణయం పై మండి పడుతున్నారు. అంతేకాకుండా విశాఖ పట్టణంలో ఉన్న చాలా కార్మిక సంఘాలు ఈ నిర్ణయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆందోళనలు నిరసనలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ వల్ల కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రైవేటీకరణ నిర్ణయానికి ముందడుగు వేసినట్లు చాలా పార్టీలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ విషయంలో ఇప్పటికే అధికార పార్టీ వైసిపి పార్టీ అధినేత సీఎం జగన్ ప్రధాని మోడీ కి లెటర్ రాయడం తెలిసిందే.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో పునరాలోచించాలని పేర్కొంటూ ..మోడీకి జగన్ లేఖ రాశారు. పరిస్థితి ఇలా ఉండగా తాజాగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఏపీ సర్కార్ కి ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో స్పష్టం చేశారు. పార్లమెంటులో వైసిపి ఎం పి పి సత్యనారాయణ వేసిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా నిర్మల సీతారామన్ సమాధానమిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో రాష్ట్రానికి ఈక్విటీ షేర్ లేదు అని.. వంద శాతం పెట్టుబడులు ఉపసంహరిస్తూన్నట్లు ఆమె స్పష్టం చేశారు. మెరుగైన ఉత్పాదకత, ప్రత్యక్ష పరోక్ష ఉపాధి కోసమే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.