ఉక్రెయిన్ పై రష్యా యుద్ద ఫందాను మార్చింది. సైనిక సమరం ద్వారా ఉక్రెయిన్ ను దెబ్బతీయడం సాధ్యం కాకపోవడంతో రష్యా యుద్ధ ఫందాను మార్చుకుంది. ఉక్రెయిన్ మౌళిక వసతుల లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో రష్యా భీకర దాడికి పాల్పడుతోంది. విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా రష్యా బలగాలు చేస్తున్న దాడులతో ఉక్రెయిన్ లో గాఢాంధకార పరిస్థితులు నెలకొన్నాయి. కీవ్, జటోమీర్, దినిప్రో, జపోరిజియాలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేస్తొంది. తమ దేశంపై రష్యా అర్దరాత్రి రాకెట్లతో విరుచుకుపడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపించారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. తాాజగా శనివారం రాత్రి జరిపిన ముప్పెట దాడితో జటోమీర్ లో రెండు లక్షల 50వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. పవర్ కట్ తో కీవ్ సహా చాలా ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లాయి.
ఇలాంటి మెరుపు దాడులతో రష్యా తమ దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉందని జెలెన్ స్కీ అన్నారు. రాత్రి సమయంలో శత్రు దేశం 36 రాకెట్లను సంధించి భారీ దాడికి ప్రారంభించిందన్నారు. వీటిలో చాలా రాకెట్లను తమ దళాలు కాల్చివేశాయని చెప్పారు. మిగతా రాకెట్లు మాత్రం తమ దేశానికి చెందిన ముఖ్యమైన స్థావరాలపై పేలాయిని చెప్పారు, ఇది చాలా నీచమైన దాడి అని విమర్శించారు జెలెన్ స్కీ. రష్యా ఉగ్రావాదుల మాదిరిగా విలక్షణమైన వ్యూహాలతో తమను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తొందని ఆయన దుయ్యబట్టారు.
రష్యా దాడులతో ఉక్రెయిన్ లోని లక్షలాది కుటుంబాలకు విద్యుత్ సరఫరా లేకుండా పోయిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. విద్యుత్ సరఫరా లేని ప్రాంతాల్లో నీటి సరపరా నిలిచిపోయింది. కనీస వసతులకు నీరు లేక ఉక్రెయిన్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆసుపత్రుల్లో విద్యుత్ సరఫరా లేక పిల్లలు, వృద్ధులకు అత్యవసర వైద్య సేవలు నిలిచిపోయాయి. పాఠశాలలు, వ్యాపార సముదాాయలు మూతపడే పరిస్థితులు నెలకొన్నాయి.