ఢిల్లీ,జనవరి 29: అయోధ్య భూమి వివాదం కేసులో కేంద్రానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే సహించేది లేదని సున్నీ వక్ఫ్బోర్డు ప్రతినిధి హాజి మెహబూబ్ అహ్మద్ అన్నారు.
అయోధ్య రామ మందిరం, బాబ్రీ మసీదు కేసులో వివాదంలో లేని 67 ఏకరాల భూమిని దాని యజమానులైన రామజన్మభూమి న్యాస్ లేదా ట్రస్ట్కు అప్పగించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
హాజి మెహబూబ్ అహ్మద్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆ భూమికి నిజమైన హక్కుదారులు హిందువులు కాదని అన్నారు. పిటిషన్ దాఖలు వెనుక భారీ కుట్ర దాగి ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పిటిషన్కు అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు వెలువరిస్తే దేశ వ్యాప్తంగా ఆందోళన సృష్టిస్తామని ఆయన హెచ్చరించారు.