Promotion: నిద్ర లేస్తూనే
ఉద్జ్యోగం ( Job ) లో మంచి స్థాయి కి చేరుకోవడానికి కొన్ని పరిహారాలు చెప్పబడ్డాయి. ఉదయాన్నే నిద్ర లేస్తూనే కళ్ళు తెరుస్తూ మనం చేయాల్సిన మొట్ట మొదటి పని మన అరచేతులను చూసుకోవాలి. జ్యోతిష్య శాస్త్రం చెప్పినదాని ప్రకారం రోజూ ఇలా చేయడం వలన వ్యక్తులు డబ్బు సంపాదించడంలో విజయం సాధిస్తారు. అరచేతుల్లో లక్ష్మీ , సరస్వతి ( saraswathi ) నివసిస్తున్నారనినమ్మకం కావడం తో ప్రతి ఉదయం వాటిని చూడడం వలన సంపదతో పాటు తెలివితేటలు కూడా వృద్ధి చెందుతాయి.
Promotion: సంతృప్తికరమైన స్థానానికి
ఉద్జ్యోగం చేసే ప్రతి ఒక్క ఉద్యోగి ఉద్యోగంలో స్థిరత్వం పొందడం కోసం శనీశ్వరుడిని ఓం చర స్థిర స్వభవాయ నమః అని మాత్రం జపిస్తూ పూజించాలి. ఈ మంత్రాన్ని శనివారం రోజున వీలయినన్ని సార్లు జపించుకుంటూ ఉండాలి. సాయంత్రం సమయంలో రావి చెట్టు సమీపం లో నువ్వుల నూనెతో దీపం పెట్టి , రావిచెట్టుకి ప్రదక్షిణాలు చేసి, ఆంజనేయస్వామి విగ్రహానికి లేదా ఫోటో కి సింధూరం లో నువ్వుల నూనె కలిపి లేపనంగా వేయాలి.శివాలయంలో ఉండే కాలబైరవుడికి ఆవనూనెతో, దీపం పెడితే ఉద్యోగంలో స్థిరత్వం పొందుతారు. శనివారం ఇంట్లోఒక ఇనుప ప్రమిదలో కొబ్బరినూనె పోసి దీపం పెట్టడం వలన మంచి ఫలితాలు పొందుతారు. శనివారం కుంకుమ తో పచ్చకర్పూరం కలిపి ముఖానికి బొట్టు పెట్టుకోవాలి. అలాగే ప్రదోష కాలంలో రావిచెట్టు, వేపచెట్టు మొదట్లోఉండే పుట్టలలో పాలు, నీళ్ళు కలిపి పోయడం వలన ఉద్యోగంలో సంతృప్తికరమైన స్థానానికి చేరుకుంటారు.
పరమేశ్వరుడి అనుగ్రహం
సోమవారం రోజు ఈశ్వరుడి ప్రతిమకు పసుపురంగు పువ్వుల మాల వేసి, గరికె పూలతో స్వామి కి పూజ చేసి
తాలింపు పెట్టిన శనగలు ప్రసాదంగా పెట్టాలి.ఆ రోజంతా ఓం వృషభ వాహనాయ నమః” మంత్రాన్ని వీలయినన్ని సార్లు జపిస్తూ ఉండాలి. అలా చేస్తే పరమేశ్వరుడి అనుగ్రహం కలిగి ఉద్యోగంలో మంచి స్థితికిచేరుకుంటారు.