Clay pots: చాలా ముఖ్యమైన అంశం. మట్టి కుండలో వంట చేసుకుని తింటే చాల ఆరోగ్యం. అందుకే ఇప్పుడు అందరు మల్లి మట్టి కుండల్ని వాడుతున్నారు. మట్టి కుండలో వండుకోవాలి అంటే ముందు కొన్ని టిప్స్ పాటించవలిసిందే.. అవేంటో చూద్దాం. వంట కోసం అన్ని రకాల కుండలు పనికిరావు. వంట కోసం తయారు చేసిన కుండల్నికొనుక్కొవాలి. కొనుక్కున్న ఆ కుండల్ని శుభ్రం చేయడం అనేది చాలా ముఖ్యమైన అంశం.
Clay pots: వేడి నిలిచి ఉండేలా
దానికోసం వంటకు వాడడానికి తెచ్చుకున్న మట్టి పాత్రలను ముందు 10 గంటలపాటు నీళ్లలో పూర్తిగా మునిగేలా ఉంచి నానబెట్టాలి. మట్టిపాత్రలకు చాలా సూక్ష్మ రంధ్రాలుంటాయి. మట్టి కుండల్ని నీటిలో నానబెట్టినప్పుడు ఆ రంధ్రాలు ముసుకు పోవడానికి అవకాశం ఉంటుంది. దింతో వండుకున్న ఆహారం ఆవిరి కాకుండా, వేడి నిలిచి ఉండేలా తయారవుతాయి. 10 గంటల తరువాత కుండను నీటి నుంచి తీసి స్క్రబ్బర్ తో కాస్త కుండ లోపల బయట రుద్ది కడిగి.. మళ్ళి కుండలో నీళ్లు పోసి స్టౌ మీద పెట్టుకుని కుండలో నీరు మరిగే వరకు ఉంచుకోవాలి. తరువాత స్టౌ ఆపేసి, నీటిని వంపేసుకోవాలి. అంతే కుండ వంటకు వాడుకోవడానికి రెడీ గా ఉన్నట్టే. మట్టి కుండలలో వంట చేయడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మట్టి పాత్రలను తయారు చేయడానికి ఉపయోగించే మట్టి ఆల్కలీన్, ఇది వంట క్రమం లో ఆహారంలోని యాసిడ్ కంటెంట్ను తటస్థీ కరించి తేలికగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
Clay pots: మంచి ప్రయోజనాలు
అలాగే, మట్టి కుండలో వండుకున్న ఆహారంలోమెగ్నీషియం, ఐరన్, కాల్షియం, సల్ఫర్ శాతం ఎక్కువగా ఉంటుంది. వంట చేసేటప్పుడు నూనె వాడకం కూడా తగ్గుతుంది. కుండలో ఉండే సహజమైన తేమ ఆహారాన్ని సరిగ్గా ఉడికేలా చేస్తుంది.దీనిలో వండడానికి అవి శుభ్రం చేయడానికి కాస్త టైం పడుతుంది. అయినా కూడా మంచి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీ కుటుంబం యొక్క కోసం వీటిని వాడండి.