గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో బీజేపీ సత్తా చాటింది. దుబ్బాక ఉప ఎన్నికలలో కనిపించిన జోరు గ్రేటర్ లో కూడా చూపించింది. దాదాపు 50 స్థానాలకు దగ్గరలో బీజేపీ గెలవడంతో రెండో అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. ఇక టిఆర్ఎస్ పార్టీ 56 స్థానాలకు గెలవడంతో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవటంతో హంగ్ ఏర్పడినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇరవై సీట్లకు దూరంగానే టిఆర్ఎస్ పార్టీ ఆగిపోవటంతో ఖచ్చితంగా ఇది హంగ్ గానే భావించాలని అంటున్నారు. వచ్చిన ఫలితాల ఆధారంగా చూసుకుంటే టిఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠంలో ఒంటరిగా కూర్చోలేని పరిస్థితి. కాబట్టి కచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీ తో చేతులు కలిపి మేయర్ స్థానంలో కూర్చునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ 43 స్థానాలలో గెలవడంతో..టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు పొత్తు పెట్టుకుని మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నట్లు తెలంగాణ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. గత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ 44 స్థానాలు గెలుచుకోగా తాజాగా ఒక స్థానం తగ్గి 43 గెలుచుకుంది. దీన్ని బట్టి చూస్తే పొత్తు ఖరారు అయితే గనుక మేయర్ పీఠం లో టిఆర్ఎస్ అభ్యర్థి కూర్చుంటే డిప్యూటీ మేయర్ స్థానాన్ని అమ్మాయి ఎంఐఎం పార్టీ అడిగే అవకాశం ఉందనే టాక్ తెలంగాణ రాజకీయాలలో వినబడుతోంది. టిఆర్ఎస్ పార్టీ కచ్చితంగా పొత్తుకి ఎంఐఎం పార్టీని ఆహ్వానిస్తే వాళ్ళు ఎటువంటి కండిషన్లు పెడతారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీజేపీతో కచ్చితంగా ఎంఐఎం పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశం లేకపోవడం తో పాటు కేసిఆర్ తో మంచి సన్నిహిత సంబంధాలు ఉండడంతో.. గ్రేటర్ లో ఎటువంటి రాజకీయ పరిణామాలు జరుగుతాయో అన్నది సస్పెన్స్ గా మారింది.