Chandra babu: ఏపీ ప్రతిపక్ష నేత , తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు.. బాబు భయపడ్డారా లేదా వైసీపీని భయపెట్టారా అనే చర్చకు కారణంగా మారాయి.
అసెంబ్లీలో జరిగింది ఇది…
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో చేసిన ప్రకటన మేరకు బడ్జెట్ సమావేశాల సందర్భంగా విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారు. విశాఖ ఉక్కు తెలుగువారి ఆత్మగౌరవంతో ముడిపడి ఉందని పేర్కొంటూ విశాఖ స్టీల్ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని, స్టీల్ప్లాంట్ నష్టాల నుంచి బయట పడేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని కోరింది. అయితే, ఈ తీర్మానంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు.
చంద్రబాబు ఏమంటున్నారంటే…
విశాఖ ఉక్కు ప్లాంట్ 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటై, వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న పేర్కొన్న చంద్రబాబు దీంతోపాటుగా ప్రస్తుత కరోనా కల్లోల సమయంలో కాలంలో 150 టన్నుల ఆక్సిజన్ రోజుకు ఉత్పత్తి చేసి దేశానికే ఊపిరి పోసిందని తెలిపారు. వెయ్యి పడకలతో కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా ఎన్నో ప్రాణాలు కాపాడుతోందని పేర్కొన్నారు. ఇలాంటి విశాఖ ఉక్కును కబళించాలని కొందరు వైసీపీ పెద్దలు కుట్రలు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఒక్క మాటకూడా మాట్లాడని వైసీపీ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడం ప్రజలను మోసం చేయడం అని ఆరోపించారు. దేశ ఆర్థికాభివృద్ధికి దోహద పడుతున్న విశాఖ ఉక్కు పరిరక్షణకు తెలుగుదేశం ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. అయితే, అసెంబ్లీ త ఈర్మానంలో తమ పాత్ర లేదన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ఈ కామెంట్లు చేస్తున్నారని పలువురు వైసీపీ నేతలు పంచ్లు వేస్తున్నారు.