ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తూ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో “వకీల్ సాబ్” చేస్తున్నాడు. దిల్ రాజు ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వరా క్రియోషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా పింక్ కి వకీల్ సాబ్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. బోనీకపూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. థమన్ సంగీతమందిస్తున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఎ.ఎం.రత్నం ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ సినిమాగా నిర్మిస్తున్నారు. కొంత టాకీ పార్ట్ కంప్లీట్ అయింది. అలాగే గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ తో ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతానికి ఈ సినిమాలన్ని అఫీషియల్ గా ప్రకటించినవి. ఈ సినిమాలు కాకుండా మరి కొన్ని చర్చల దశలో ఉన్నాయని…దర్శకులు వీళ్ళే అన్న ప్రచారం గత కొంత కాలంగా జరుగుతూనే ఉంది.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తన 29 వ సినిమాని ఏ దర్శకుడితో చేయబోతున్నారన్న క్యూరియాసిటీ అందరిలోను ఉంది. అయితే తనకి అత్యంత సన్నిహితుడు..ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ తో పవన్ కళ్యాణ్ 29 ఉండబోతుందని అంటున్నారు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి, సుకుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. కాగా తాజాగా మరో మాస్ డైరెక్టర్ పేరు ప్రచారంలోకి వచ్చింది. ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ తో “క్రాక్” సినిమాని తెరకెక్కించిన గోపీచంద్ మలినేనితో పవన్ కళ్యాణ్ తన 29 చేస్తాడని తెలుస్తుంది. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో అధికారకంగా వెల్లడైతేగాని క్లారిటీ వస్తుంది. మరో వైపు గోపీచంద్ కి ఆ ఛాన్స్ రావడం కష్టమే అన్న టాక్ కూడా వినిపిస్తుంది.