సరిహద్దు ప్రాంతాల్లో చైనా ఆర్మీ భారత భద్రతా దళాలపై దాడి చేసింది అంటే అందరూ…. సెకండ్ కు పది రౌండ్ల బుల్లెట్లు కాల్చే కలిగిన భారీ తుపాకులు, శరీరాన్ని క్షణాల్లో విచ్ఛిన్నం చేసే గ్రెనేడ్లు లేదా ఒకే దెబ్బకు 100 మందిని చంపేసే బంకర్లను ఊహించుకుంటారు.
అయితే ఇక్కడ జరిగిన దాడిలో చైనా జవాన్లు ఉపయోగించింది మాత్రం ఇనుప తీగలు చుట్టిన వెదురు బొంగులు, బండరాళ్లు మరియు ఇనుప రాడ్లు. మొదట భారత దళాల పై కవ్వింపు చర్యలకు పాల్పడినవారు పదే పదే సరిహద్దులు దాటి లోనికి వచ్చి భారత జవాన్ల కు సవాల్ విసిరారు అని మీడియా వర్గాలు చెబుతున్నాయి.
ఇక మొదట చైనా వారే భారత జవాన్ల పై దాడి చేయగా…. భారతీయులు కేవలం తమ రక్షణ కోసం ప్రతి దాడి చేశారని అంటున్నారు. తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ తో పాటు మరో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందగా మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆరు కూడా ఆఖరికి చికిత్స పొందుతూ మరణించారు. మైనస్ డిగ్రీల లో ఉండే ఉష్ణోగ్రత మరియు వైద్య సదుపాయాల కు అనువుగా లేని ప్రదేశంలో దాడులు జరగడం కారణంగా గాయపడిన సైనికుల ప్రాణాలు కాపాడడం కష్టమైందని ఆర్మీ వర్గాలు చెప్పాయి.