అది ఓ అందమైన కుటుంబం. ఇద్దరు కూతుళ్లతో భార్యా భర్తలు ఎంతో షంతోషంగా గడిపేవారు. కాని అనుకోని ఆ ఘటన ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేసింది. ఎంతో ప్రేమగా పెంచుకున్న ఇద్దరు కూతుళ్లు, భార్య చెరువులో శవాలుగా తేలారు. అసలేం జరిగింది? వారి చావుకు కారణం ఏమిటి? హత్య? ఆత్మహత్య? సాయంత్రమని బయటకు వెళ్లిన వారు తెల్లారే సరికి చెరువులో తేలడం అక్కడి జనాలను శోక సంద్రంలో ముంచింది. అసలు వారి మరణానికి కారణం ఏమై ఉంటుంది..?
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం నరపాంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…శ్రీనివాసరాజు కు తొమ్మిదేండ్ల కిందట తన మేనకోడలైన గౌరితో వివాహం జరిగింది. సొంతూరు విజయ నగరం జిల్లా గజపతినగరం కాగా, అక్కడి నుంచి కొత్తవలస మండలం తుమ్మికాపల్లి వలస వచ్చి జీవిస్తున్నారు. వీరికి ఏడేళ్లు, ఆరేళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శ్రీనివాసరాజు లారీ డ్రైవర్ గా పనిచేసేవాడు.
కాగా ఓ రోజు గౌరీ తన ఇద్దరు కూతుళ్లతో పానీపూరీ తిందామంటూ బయటకు వెళ్లారు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ముగ్గురూ చెరువులో శవాలై తేలారు. దీనితో వారి మరణానానికి కారణం ఏమై ఉంటుందని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆత్మ హత్యా లేక హత్యా.. ఆత్మ హత్య చేసుకోవడానికి ఎం అవసరమొచ్చింది. భార్య భర్త మధ్య దాంపత్యం బాగానే ఉంది. మరి హత్య అయితే ఎవరు చేసుంటారు. ఎందుకు చేసుంటారు. ఈ విషాద ఘటనతో స్థానికుల గుండె చెరువైంది.
అక్టోబర్ 15 న సాయంత్రం గౌరీ తన ఇద్దరు పిల్లలను వెంటపెట్టుకుని బయటకు వెళ్లింది. సాయంత్రమైనా వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై రాత్రంతా చుట్టుపక్కల వెతికారు. అయినా వారి ఆచూకి లభించకపోవడంతో ఉదయం గాలిస్తూ చెరువు దగ్గరకు వెళ్లి చూసారు. అక్కడ పిల్లల కాలి గుర్తులు కనిపించాయి. దానితో చెరువులో గాలించగా ముగ్గురి మృత దేహాలు బయటపడ్డాయి. అది చూసిన కుటుంబ సభ్యుల, స్థానికుల రోదన వర్ణింపలేనిది. ఏ కారణం చేత వీరు ఇలా అయ్యారని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. వీళ్ల మరణం ఒక మిస్టరీగానే ఉంది. వీరి చావుకు కారణం పోలీసులకు కూడా తెలియడం లేదు. అబంశుభం తెలియని చిన్నారుల మరణం అందరినీ కంటతడి పెట్టించింది.