బాహుబలి ఫ్రాంఛైజీతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా అనూహ్యమైన క్రేజ్ అండ్ పాపులారిటీని సాధించాడు. అప్పటి నుండి ప్రభాస్ నుంచి వచ్చే సినిమా గురించి దేశవ్యాప్తంగా అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సాహో సినిమా నుంచి ప్రభాస్ నటించే ప్రతీ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతున్నాయి. అందుకు కారణం ప్రభాస్ యూనివర్సల్ హీరోగా క్రేజ్ పొందడమే.
ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్నాడు. కొంత భాగం విదేశాలలో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా పీరియాడిక్ లవ్ స్టోరీగా భారీ హంగులతో రూపొందిస్తున్నారు. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియీషన్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్.. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనుండగా ఈ సంవత్సరం చివరలో చిత్రీకరణ మొదలు పెట్టేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.
సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ సూపర్ హీరో పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. సైన్స్ ఫిక్షన్ జానర్ కాబట్టి గ్రాఫిక్స్ వర్క్ భారీ లెవెల్లో ఉండబోతుందని తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేయనున్నట్లు చర్చించుకుంటున్నారు. కాగా ప్రభాస్ బాహుబలి నుంచి సినిమా సినిమాకి మధ్య దాదాపు రెండేళ్ళు టైం తీసుకుంటున్నాడు. ఇదే ఇప్పుడు అందరిలోను కలుగుతున్న సందేహం. బాహుబలి రెండు భాగాలకి దాదాపు ఐదేళ్లు కేటాయించాడు ప్రభాస్. తర్వాత సాహోకి రెండేళ్లు టైం తీసుకున్నాడు.
ఇప్పుడు రాధేశ్యామ్ కోసం రెండేళ్ల పైనే అవుతోంది. బాహుబలి సినిమా 2015లో విడుదల కాగా.. 2017లో బాహుబలి-2 విడుదలైంది. ఆ తర్వాత 2019లో సాహో రిలీజైంది.
ఇక ప్రస్తుతం సెట్స్ మీదున్న రాధేశ్యామ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఖచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు రాధేశ్యామ్ సగభాగం కూడా టాకీపార్ట్ కంప్లీటవలేదన్న సమాచారం. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఇప్పుడు కరోనా ప్రభావం. ఈ ఏడాది చివరిలో షూటింగ్ మొదలు పెడతామని మేకర్స్ అంటున్నారు.
2021 సమ్మర్లో రిలీజ్ అన్న మాట వినిపిస్తుంది. కాని ఆ పరిస్థితులు కనిపించడం లేదట. ఇక నాగ్ అశ్విన్ తో సినిమాకి ఎన్నేళ్లు టైం కేటాయిస్తాడో .. ఆ సినిమా రిలీజ్ ఎప్పుడవుతుందో అని ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారట. ఇలానే ప్రతీ సినిమాని డిలే చేస్తూ వస్తే ఇంత కష్టపడి సాధించిన పాన్ ఇండియా స్టార్ అన్న పేరు కి డామేజ్ జరుగుతుందేమనని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారట.