నిత్యం ఎదో ఒక వివాదంలో ఉండే స్వామి నిత్యానంద ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపాడు. నిత్యానంద తన దేశం కైలాసలో సొంత బ్యాంకును రిజర్వ్ బ్యాంకు ఆఫ్ కైలాస (ఆర్బీకె) ప్రారంభిస్తుంన్నారట. అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద స్వామి నిత్యానంద 2018 నుండి అజ్ఞాతంలో ఉన్నారు. తొలుత అత్యాచారం, లైంగిక దాడి ఆరోపణలపై అరెస్ట్ అయిన వివాదాస్పద స్వామి నిత్యానంద కొంత కాలం కర్ణాటకలోని రామనగర జైలులో ఉన్నారు. తరువాత బెయిల్ పై బయటకు వచ్చిన నిత్యానంద కొన్ని నెలల పాటు కోర్టు వాయిదాలకు హాజరయ్యారు. అనంతరం గుజరాత్ లో పిల్లలను కిడ్నాప్ చేశాడన్న ఆరోపణపై కేసు నమోదు అయ్యింది. నిత్యానంద కు చెందిన ఇద్దరు శిష్యులను గుజరాత్ పోలీస్ లు అరెస్ట్ చేశారు. ఆ తరువాత పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లారు.
అనంతరం నిత్యానంద నకిలీ పాస్ పోర్ట్ తో నేపాల్ మీదుగా దేశం విడిచి పారిపోయారు. బెంగళూరు నగర శివారులోని బిడిదిలో వివాదాస్పద స్వామి నిత్యానందకు ప్రధాన ఆశ్రమం ఉంది. అక్కడి నుండి ఆధ్యాత్మిక గురువుగా, భోదకుడిగా చలామణి అవుతూ దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆశ్రమాలను నెలకొల్పారు. అయనకు భారత దేశంలో వివిధ ప్రాంతాల్లో భక్తులు, శిష్యులే కాకుండా విదేశి భక్తులు ఉన్నారు.
వివాదాస్పద స్వామి నిత్యానంద ఈక్వెడార్ నుండి ఒ చిన్న ద్విపాన్ని కొనుగోలు చేసి డానికి కైలాస అని పేరు పట్టారని గతంలోనే వార్తలు వచ్చాయి. కైలాస ను ఒక దేశంగా గుర్తింపు ఇవ్వాలని వివాదాస్పద స్వామి నిత్యానంద ఐక్య రాజ్య సమితి కి విజ్ఞప్తి చేయనున్నారని ఆ దేశ వెబ్ సైట్ పేర్కొన్నది. ఇప్పటికే నిత్యానంద కైలాస ద్విప దేశానికి ఒక పాస్ పోర్ట్ ను, జండాను, జాతీయ చిహ్నాన్ని డిజైన్ చేసుకోగా, ఇప్పుడు తాజాగా నిత్యానంద ఫోటోతో కూడిన కరెన్సీ కూడా విడుదల చేస్తూ మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు.
వివాదాస్పద స్వామి నిత్యానంద గణేష్ చతుర్దశి నాడు అంటే ఈ నెల 22న రిజర్వ్ బ్యాంకు ఆఫ్ కైలాస (ఆర్ బీ కె)ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అదే రోజు నుండి ఆర్ బీ కె కరెన్సీ చెలామణిలో ఉంటుందని, పలు దేశాల బ్యాంకులతోనూ ఎం ఒ యూ చేసుకున్నారట. ఏ దేశ కరెన్సీ అయినా కైలాసలో చెల్లుబాటు అవుతుందట. అదే విధంగా ఆర్ బీ కె కరెన్సీ కూడా ఏ దేశంలో అయినా చెల్లుబాటు అవుతుందట. చిత్రంగా లేదు ఇదంతా?