సౌత్ ఇండియా సూపర్ స్టార్ట్ రజనీకాంత్ తీవ్ర అస్వస్థతతో శుక్రవారం ఉదయం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తేలిసిందే. రక్తపోటు (హైబిపి) అధికం కావటంతో రజనీని అయన కుమార్తె హుటాహుటిన అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. రజనీ అనారోగ్యంకు గురై అపోలో ఆసుపత్రిలో చేరారు అని తెలియడంతో అభిమానులు ఆందోళనకు గురైయ్యారు. వివిధ రంగాల ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు రజనీ త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. అభిమానులు ప్రార్థనలు చేశారు.
శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు అపోలో వైద్యులు రజనీ కి పలు రకాల పరీక్షలు నిర్వహించారు. వైద్య చికిత్సల అనంతరం రజనీ ఆరోగ్యం మెరుగు పడింది. శుక్రవారం రాత్రి, శనివారం పలు పరీక్షలు చేయగా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అపోలో ఆసుపత్రి వైద్య బృందం తెలిపింది. కొన్ని రకాల పరీక్షల రిపోర్ట్ లు రావాల్సి ఉందని తెలిపారు. రజనీ ఆరోగ్య పరిస్థితి బాగా ఉందని, ఆదివారం ఉదయం డిశ్చార్జ్ చేస్తామని అపోలో వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు.
రజనీకాంత్ సినీ షూటింగ్ లో భాగంగా పది రోజుల క్రితం హైదరాబాద్ కు వచ్చారు. ఈ నెల 22వ తేదీన షూటింగ్ బృందానికి కరోనా పరీక్షలు నిర్వహించగా నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. రజనీ తో సహా పలువురు ముఖ్య నటులకు కరోనా నెగటివ్ రిపోర్ట్ వచ్చినప్పటికీ చిత్ర యూనిట్ లో పలువురికి పాజిటివ్ నిర్ధారణ అయినందున వీరంతా సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉండిపోయారు. ఈ సమయంలో రజనీ హై బీపితో అస్వస్థతకు గురి అయ్యారు. మొత్తానికి అభిమానుల ప్రార్ధనలు ఫలించి తలైవా ఆరోగ్య వంతుడిగా డిశ్చార్జ్ అవుతున్నారు. కాగా ఈ పరిస్థితిలో ముందుగా ప్రకటించిన విధంగా ఈ నెల 31వ తేదీన పార్టీ ప్రకటన చేస్తారా? లేక ప్రకటన తేదీ వాయిదా వేస్తారా అనేది ఒకటి రెండు రోజులలో తెలిసే అవకాశం ఉంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!