sleep walk: సాయంత్రం కంటే ఉదయం మనుషులు కాస్త ఎక్కువ పోడ ఉంటారు అని పలు పరిశోధనలో బయటపడింది . ఇందుకు ముఖ్య కారణం రాత్రుళ్లు మన వెన్నెముక పై బరువు తగ్గి అది కాస్త విశాలంగా అవుతుంది. నిద్ర సమయంలో శరీరం విశ్రాంతి లో ఉంటుంది కాబట్టి రక్తప్రసరణ వేగం కాస్త తక్కువగా ఉంటుంది.కొందరికి నిద్రపోతున్న సమయంలో నడిచే అలవాటు ఉంటుంది. నిద్రలో కాళ్లు కదపడం ,చేతులు పక్కకు వేయడం లాంటిదే నడవడం కూడా అని నిపుణులు తెలియచేస్తున్నారు.
నిద్రపోతున్న సమయంలో ఈ రోజు ఏ కల రాలేదు అని అనుకుంటూ ఉంటాము.కానీ అది నిజం కాదు. ఎందుకంటే ఒక మనిషి ఇంచుమించుగా రోజుకు మూడు నుంచి ఐదు కలలు కంటారు.నిద్రపోతున్న సమయంలో శరీరంలో విషవాయువులు ఒక చోటకు చేరుతాయి. మర్నాడు వాటిని మనం వివిధ రూపాల్లో బయటకు విసర్జిస్తాం. చాలామందికి నిద్రలో ఉన్నపుడు కొద్దీ సేపు శ్వాస ఆగుతుంది. అయితే మరికొంతమందికి చాలా సేపు శ్వాస అగుతుంది. అయితే ఈ సమయంలో నోటి ద్వారా శ్వాస తీసుకోవడం జరుగుతుంది. చాలామంది నిద్రలో పళ్ళు కోరుకుతుంటారు. ఈ స్థితి నుండి బయట పడటానికి ఖచ్చితం గా వైద్యం చేయించుకోవాలి. ఇలా కొరకడం వలన దంతాల పగుళ్ళు లేదా దంతాల చిప్పింగ్ వంటివి జరగడం తో పాటు దవడ కండరాలు పుండ్లకు గురవుతాయి. కానీ పళ్ళు కొరకటానికి ఖచ్చితమైన కారణం తెలియదు. కానీ ఒక అధ్యయనం వలన తెలిసింది ఏమిటంటే ఒత్తిడి మరియు యాంగ్జైటీ వలన ఇలా జరగవచ్చట. ఒకవేళ మీరు గాని నిద్రలో పళ్ళు కొరుకుతూ నట్లయితే వెంటనే డెంటిస్ట్ దగ్గరకు వెళ్లి మౌత్ గార్డు పెట్టించుకోండి .
నిద్రలో లో ఉన్నప్పుడు వాసన ని పసిగట్టే గుణం ఉండదు దీనివల్ల ఇంట్లో నిప్పు అంటుకున్న విషయం కూడా ఇంట్లో వారికి తెలియదు, ఇలా జరిగిన కేసులు చాలానే ఉన్నాయి. నిద్రపోతున్న సమయంలో విషవాయువుల నుండి వాసన పసిగట్టలేక చాలామంది విషవాయువులను పీల్చి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు దీనికి ఉదాహరణ .నిద్రతో విశ్రాంతి దొరుకుతుంది అనుకుంటున్నాం కానీ ఇన్ని జరుగుతున్నాయి అని ఎప్పుడు అయినా ఆలోచించారా…