జీవితంలో ఒక్కోసారి తీసుకునే నిర్ణయాలు పైకి ఎదగడానికి చాలా ఉపయోగపడితే, మరికొన్ని సందర్భాల్లో ఆ నిర్ణయాలు జీవితాన్నే శాసించి కనుమరుగు అయ్యేలా చేస్తాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ విషయాన్నే కీర్తి సురేష్ నిరూపించిందని చెప్పవచ్చు. అదెలా అంటే..కీర్తి సురేష్ ప్రధానపాత్రలో నటించిన మహానటి సావిత్రి బయోపిక్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ అద్భుత నటన ప్రదర్శించింది. అయితే మహానటి గా కీర్తి సురేష్ మొదటి చాయిస్ కాదని, ఈ అవకాశం మొదట అమలా పాల్ ను వరించగా కొన్ని కారణాల వల్ల తాను నటించలేక పోయానని ఈ మధ్య ఈ విషయాన్ని అమలాపాల్ చెప్పిన విషయం తెలిసిందే.
ఇకపోతే ముందుగా ఈ కథని దర్శకుడు నాగ్ అశ్విన్, కీర్తి సురేష్కు చెప్పినప్పుడు అంత గొప్ప కథను తాను సరిగ్గా డీల్ చేయలేను అని కాస్త తడబాటుకు గురైందట ఈ మహా నటి. ఇక నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వినిదత్ నిర్మాతగా తెరకెక్కిన సినిమా మహానటి. ఈ సినిమాతో అంతవరకు రాని క్రేజీని ఒక్క సారిగా సొంతం చేసుకుంది ఇందులో ప్రధాన పాత్రలో నటించిన కీర్తి సురేష్.. తెలుగు చిత్ర పరిశ్రమకు నేను శైలజ సినిమా ద్వారా హీరోయిన్ గా తెరంగేట్రం చేసి తొలి సినిమాతోనే మంచి సక్సెస్ ని అందుకుంది. ఆ తర్వాత నేనులోకల్, అజ్ఞాతవాసి వంటి సినిమాల్లో చూడచక్కనైన అందంతో పాటుగా, ఆకట్టుకునే అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో హీరోయిన్ గా మంచి పేరు దక్కించుకుంది.
ఇక ఆ తర్వాత అనుకోకుండా ఆమెకు నాగ అశ్విన్ తీసిన మహానటిలో ప్రధాన పాత్రకు ఛాన్స్ రావడం, ఈ సినిమాకి గాను ఒక పక్క ఫిలింఫేర్, మరోపక్క జాతీయ స్థాయి అవార్డులను అందుకోవడం ఆమె జీవితంలో మరచిపోని సంఘటనలు. ఈ విధంగా మొదట అమలాపాల్ చేయవలసిన దిగ్గజ నటి సావిత్రి బయోపిక్, అనంతరం కీర్తి సురేష్ వద్దకు చేరడం జరిగింది. అంతేకాదు ఈ పాత్రకు నయనతార, నిత్య మీనన్ ల పేర్లు ప్రచారం జరిగాయి. ఒకవేళ కీర్తి సురేష్ గనుక ఈ సినిమా మిస్ చేసుకుంటే ప్రస్తుతం ఆమె స్దానం చిత్రపరిశ్రమలో ఎక్కడ ఉండేదో.