NewsOrbit
న్యూస్

అబ్బా! అలా జరిగితే ఎలా ? అని వైసీపీ అంతర్మధనం!!

విజయవాడలోని కనకదుర్గ ఫైఓవర్ విషయంలో బిజెపి టిడిపి కలిసి వైసీపీకి షాక్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఫ్లైఓవర్ను వైసిపి ప్రభుత్వం తాను పూర్తిచేసినట్టు చెప్పుకుని క్రెడిట్ కొట్టేయాలని చేస్తుండగా ఇందుకు టిడిపి కౌంటర్ అటాక్ ఇచ్చింది.

Kanaka Durga flyover status || Vijayawada - YouTube

ఈ విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కూడా టిడిపికి మద్దతు ప్రకటించడంతో వైసిపి పని కుడితిలో పడ్డ ఎలుకలాగా మారింది .నిజానికి ఇది విజయవాడ ప్రజల డ్రీమ్ ప్రాజెక్ట్.2011 లోనే టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఈ ఫైఓవర్ కోసం పోరాటం మొదలుపెట్టింది.ప్రస్తుత టీడీపీ శాసనమండలి సభ్యుడు బుద్దా వెంకన్న ఆ ఫైఓవర్ కోసం అప్పట్లో ఆమరణ నిరాహర దీక్ష కూడా చేశారు.ఈ విషయమై జరిగిన ధర్నాల్లో చంద్రబాబునాయుడు సైతం పాల్గొన్నారు.

2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత, విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకువెళ్ళే బాధ్యత తీసుకుని, చంద్రబాబు సహకారంతో, కేంద్రంతో సమన్వయం చేసుకుని ప్రాజెక్ట్ మొదలు పెట్టేలా చేసారు.అయితే వివిధ కారణాలతో ప్రాజెక్ట్ నిర్మాణం లేట్ అవుతూ వచ్చింది. డిజైన్లలో మార్పులు, రాజకీయంగా టిడిపితో వైరం రావటంతో నిధులు ఇవ్వకపోవటం, ఇలా వివిధ కారణాలతో లేట్ అయ్యింది. 2019 జూన్ నాటికి 85 శాతం పనులు పుర్తయయ్యి. మరో రెండు మూడు నెలల్లో ప్రాజెక్ట్ అయిపోయేది.

అయితే ప్రభుత్వం మారటంతో ప్రాజెక్ట్ పూర్తి మరింత లేట్ అయ్యింది. ఎట్టకేలకు జగన్ ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో పనులు ముగిసి ఫ్లై ఓవర్ లోడ్ టెస్టింగ్ కూడా అయిపోయింది. నిజానికి ఈ ఫ్లైఓవర్ విషయంలో ఎనభై ఐదు శాతం పనులు చేసింది టిడిపి ప్రభుత్వం అయితే కేవలం పదిహేను శాతం మాత్రమే జగన్ సర్కారు చేసింది.మొత్తం మీద ఎట్టకేలకు ఈ ప్రాజెక్ట్ ను సెప్టెంబర్ 4న ప్రారంభం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. సరిగ్గా ఇదే సమయంలో, ఈ ఫ్లై ఓవర్ మొత్తం తమ వల్లే అయ్యింది అంటూ, వైసీపీ క్రెడిట్ కొట్టేయటం ప్రారంభించింది.

ఈ విషయాన్ని గమనించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని చాలా తెలివిగా వ్యవహరించారు.సైలెంటుగా ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి, ఫ్లై ఓవర్ పూర్తికి సహకరించినందుకు అభినందించారు. అంతే కాదు, ఫ్లై ఓవర్ ఓపెనింగ్ కు రావాల్సిందిగా గడ్కరీని ఆహ్వానించారు. కేశినేని నాని పట్టుబట్టటంతో గడ్కరీ కూడా ఒప్పుకున్నారు. వీలు ఉంటే తానే స్వయంగా విజయవాడ వస్తానని, లేకపోతే ఆన్లైన్ లో ప్రారంభం చేస్తానని చెప్పారు.

దీంతో వైసిపి గొంతులో వెలక్కాయపడింది .గడ్కరీ పాల్గొంటే, గతంలో ఈ ప్రాజెక్ట్ కోసం భుసేకరణ చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని, స్థానిక ఎంపీ కేశినేని నాని కృషిని, బుద్దా వెంకన్న ఉద్యమాన్ని, కేంద్ర సహకారాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ లో వైసీపీ పాత్ర పరిమితం అని ప్రజలకు తెలిసిపోయే ప్రమాదముందని వైసిపి ఆందోళన చెందుతోంది .

author avatar
Yandamuri

Related posts

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju