మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్ ఈ సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. అనుకున్నట్లే పంచాయతీ ఎన్నికలకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. ఎన్నో నెలలుగా సాగుతున్న వివాదం చివరికి సద్దుమణిగింది. రాష్ట్ర ఎస్ ఈ సి నిమ్మగడ్డకు ఏపీ ప్రభుత్వంలో ఉన్న వైరం వల్ల ఎన్నికల నిర్వహణకు ఇన్నాళ్లు అడ్డంకులు ఏర్పడ్డాయి. అయితే చివరికి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం కమిషన్ కు సహకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈరోజు అత్యుత్తమ న్యాయస్థానం ఎన్నికల ప్రక్రియ అనేది రాజ్యాంగంలో ఒక భాగమని…. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎంత ముఖ్యమో ఎన్నికలు కూడా అంతే ముఖ్యం అని…. ఇతర రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎన్నికలు అడ్డుగా లేనప్పుడు ఏపీ రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వలేమని పేర్కొన్నారు. ఇక తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎన్నికలకు ప్రభుత్వం సహకరించాల్సిన విషయం పై సీఎం జగన్ అత్యవసర సమావేశం కొద్ది సేపటి క్రితమే ఏర్పాటు చేశారు. ఈ సమావేశం అనంతరం ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు తెలిసింది.
ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఆయన ఈ లేఖ ద్వారా ఎన్నికల సంఘానికి తెలియజేశారని సమాచారం. జగన్ సర్కారు ఇన్ని రోజులు ఇచ్చిన ఫైట్ చేసినట్లు స్పష్టం అవుతోంది. ఇక ఈ విషయంపై అధికారికంగా ప్రభుత్వం కూడా స్పందించింది. గత ఏడాది మార్చిలో జరిగిన పంచాయతీ ఎన్నికలు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరుగుతున్నాయి. ఇక గత ఏడాది నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోవిడ్ లాక్ డౌన్ కారణంగా ఎన్నికలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఈ విషయంపై ఉద్యోగ సంఘాల తీరు ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.