అల వైకుంఠపురములో వంటి ఇండస్ట్రీ రికార్డ్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్ లో హ్యాట్రిక్ సినిమా చేస్తున్నాడు. పుష్ప అన్న ఈ పాన్ ఇండియా సినిమాని అయిదు భాషల్లో సుకుమార్ రూపొందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. మరో హీరోయిన్ గా నిత్యా మీనన్..నివేదా థామస్ ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీ ప్రసాద్ సంగితమందిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాగ్డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే అల్లు అర్జున్ ఎప్పటి నుంచో ఒక దర్శకుడితో చేయాల్సిన సినిమా హోల్డ్ లో ఉంది. అదే ఐకాన్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చేస్తున్నాడు. ఈ సినిమా దాదాపు టాకీపార్ట్ కంప్లీటవగా ఒక సాంగ్ తో పాటు పవన్ కళ్యాణ్ మీద తీయాల్సిన కొన్ని కోర్ట్ సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలో షూటింగ్ మొదలు పెట్టి సినిమాని పూర్తి చేస్తారని దిల్ రాజు ఇటీవల వెల్లడించారట. ఇక ఈ సినిమా తెరకెక్కిస్తున్న దర్శకుడి సక్సస్ మీదే ఆల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఆదారపడి ఉందని తెలుస్తుంది.
వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరాం కి సక్సస్ పరంగా గొప్ప ట్రాక్ రికార్డ్ ఏమీ లేదని చెప్పాలి. గతంలో ఓ మై ఫ్రెండ్ తీసి ఫ్లాప్ ఇచ్చాడు. ఆ తర్వాత నాని తో తీసిన ఎంసిఎ కూడా గొప్ప కమర్షియల్ సినిమా కాదన్న సంగతి తెలిసిందే. అందుకే వేణు శ్రీరాం తో చేయాలనుకున్న ఐకాన్ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి పుష్ప ని లైన్ లో పెట్టాడట అల్లు అర్జున్. ఇప్పుడు వేణు శ్రీరాం వకీల్ సాబ్ తో ఒక భారీ హిట్ ఇస్తేనే తర్వాత అల్లు అర్జున్ తో ఐకాన్ చేసే అవకాశం ఉంటుంది. లేదంటే ఐకాన్ జారిపోయో అవకాశాలున్నాయి. అంతేకాదు అజ్ఞాతవాసి లాంటి భారీ డిజాస్టర్ ..ఆ తర్వాత రెండేళ్ళు రాజకీయాల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా వకీల్ సాబ్..దాని కి దర్శకుడు వేణు శ్రీరాం కావడం తో ఆ రకంగా కూడా ఈ దర్శకుడి మీద ఒత్తిడి బాగానే ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కి హిట్ ఇవ్వాలి. దీని వల్ల ఈ ఇద్దరు మెగా హీరోల మధ్య నలిగిపోతున్నాడట.