ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏంటి అన్న దానిపై “వే టు న్యూస్” అనే సంస్థ సర్వే చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మంది వద్ద సర్వే చేసి ఫలితాలు రాబట్టింది. వచ్చిన ఫలితాలు చూస్తే విచిత్రమైన మార్పు ఏపీ లో ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి విషయంలోకి వెళితే 48 శాతం మంది ప్రజలు వైసీపీ పార్టీకి జై కొట్టగా, 35 శాతం ప్రజలు టీడీపీకి జై కొట్టారు.
కానీ అనూహ్యంగా జనసేన- బిజెపి కూటమికి 12 శాతం మంది ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. ఇతరులకు వచ్చేసరికి ఐదు శాతం. వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే వైసీపీ ప్రభుత్వం పై కొద్దిగా వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. గతసారి 51 శాతం ఓట్లు రావటం ఇప్పుడు తగ్గటం అందుకు నిదర్శనమని చెప్పవచ్చు. టిడిపి పార్టీ పరిస్థితి అయితే మరీ డేంజర్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
2019 ఎన్నికల్లో టీడీపీ 40 శాతం ఓట్లు రాబట్టగా ఇప్పుడు ఐదు శాతానికి తగ్గి, 35 శాతం కి పడిపోయిన పరిస్థితి. అధికార ప్రతిపక్ష పార్టీ పరిస్థితి అలా ఉంటే.. రాష్ట్రంలో తృతీయ కూటమి అయిన బీజేపీ- జనసేన కి ఊహించని విధంగా పెరగటంతో ఏపీ ప్రజల ఆలోచనలో మార్పు వస్తున్నట్లు తాజా ఫలితాలు బట్టి పొలిటికల్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా బిజెపి జనసేన కూటమి.. టిడిపి ఓటు బ్యాంకు కి భారీగానే గంటి కోడుతున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఇదే పరిస్థితి రాబోయే రోజుల్లో కొనసాగుతూ ఉంటే ఏపీ పొలిటికల్ ముఖచిత్రం మారే అవకాశం ఉందని టిడిపి ప్లేస్ జనసేన బిజెపి రీప్లేస్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా జగన్ ఓటు బ్యాంకు కూడా తగ్గే పరిస్థితి ఉందని అభిప్రాయపడుతున్నారు.