పవన్ కళ్యాణ్.. జనసేనాని నిర్ణయాలు ఒక్కొక్క సారి సంచనాలకు కేంద్ర బిందువు అవుతాయన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇలాంటి వార్త ఒకటి ఫిలిం వర్గాల్లో వినిపిస్తుందట. రాజకీయాల్లో నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇటీవల బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అందరిలో హీట్ పెంచిన విషయం తెలిసిందే. మరి పొలిటికల్ కెరియర్ సంగతి ఏంటని ఆలోచించే వారు కూడా ఉన్నారు. మరి కొందరైతే ఇలా రెండు పడవల మీద ప్రయాణం అంతగా పవన్ కు కలసి రావడంలేదని అనుకుంటున్నారు. ఈ సమయంలో ఈ జనసేన జనప్రయాణం మరో సారి హాట్ టాపిక్ అయ్యిందంటున్నారు. ఇక పవన్ సినిమాలకు బ్రేకిచ్చి పూర్తిగా జనంలోకి వెళతారా? తిరిగి పూర్తిగా పొలిటిషియన్ గా మారతారా అనే ప్రశ్నకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ మీడియా సమావేశంలో వెల్లడించిన కొన్ని అంశాలు సమాధానంగా మారాయట.
ఇందులో భాగంగా 2021 జనవరి నుండి పవన్ కళ్యాణ్ ప్రతి నెలా నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించాలనే ప్రణాళికలో ఉన్నారట. ఇంత వరకు బాగానే ఉన్నా.. జనసేన ప్రకటనతో ఇప్పటికే కమిట్ మెంట్లు ఉన్న దర్శక, నిర్మాతల గుండెల్లో హార్ట్ బీట్ పెరిగిపోయిందట. ఇక ఇప్పటికే పవన్ కోసం స్క్రిప్టులు రెడీ చేస్తున్న దర్శకుల సంగతి ఏంటి.. అదీగాక క్రిష్, హరీష్ శంకర్.. సురేందర్ రెడ్డి వంటి స్టార్ డైరెక్టర్ల తో చేయవలసిన చిత్రాల పరిస్దితి ఎలా ఉంటుంది అన్నదానికి సరైన ఆన్సర్ లేదు. ఇలా పవన్ కళ్యాణ్ ఎవరూ ఊహించని విధంగా తీసుకున్న నిర్ణయం అతని రాజకీయ భవిష్యత్తుకు సరైనదే అయినా సినిమా దర్శకులకు మాత్రం మింగుడుపడటం లేదన్న మాట వినిపిస్తోంది.
అయితే పవన్ కళ్యాణ్ సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కమిటయిన వకీల్ సాబ్ సహా అన్నీ ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ని దాదాపు పూర్తి చేసేశాడు. జనవరి నుంచి మలయాళ హిట్ సినిమా అయ్యప్పనం కోషియం మొదలు పెట్టనిన్నారు. ఈ సినిమాలో రానా దగ్గుబాటి కూడా మరో హీరోగా నటిస్తున్నారు. అలాగే క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలని వీలైనంత త్వరలో పూర్తి చేస్తారని అంటున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!