ఇండియన్ ప్రీమియర్ లీగ్లో గత 12 సంవత్సరాలుగా ఆయా టీంలకు పలువురు కెప్టెన్లు మారారు. ఇక కొన్ని టీంలకు అయితే మొదటి నుంచి ఒకే కెప్టెన్లు ఉంటూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఐపీఎల్లో ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మలే బెస్ట్ కెప్టెన్లుగా ఉన్నారు. కానీ గతంలో షేన్ వార్న్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండుల్కర్ వంటి ప్రముఖులు కూడా పలు టీంలకు కొద్ది సీజన్ల పాటు కెప్టెన్లుగా వ్యవహరించారు. అయితే త్వరలో ఐపీఎల్ 13వ ఎడిషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 8 జట్లకు చెందిన కెప్టెన్ల ట్రాక్ రికార్డు, సక్సెస్ రేటు ఎలా ఉందో ఒక్కసారి పరిశీలిద్దాం.
ఎంఎస్ ధోనీ (చెన్నై సూపర్ కింగ్స్)
ఎంఎస్ ధోనీ గురించి క్రికెట్ అభిమానులకు పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ధోనీ ఆధ్వర్యంలో సీఎస్కే 3 ఐపీఎల్ టైటిల్స్ ను సాధించింది. సీఎస్కే తరఫున ధోనీ 174 మ్యాచ్లు ఆడాడు. కెప్టెన్గా 59.8 శాతం మ్యాచ్లను గెలిచాడు.
డేవిడ్ వార్నర్ (సన్రైజర్స్ హైదరాబాద్)
వార్నర్ సారథ్యంలో హైదరాబాద్ జట్టు 2016 ఐపీఎల్ టైటిల్ను సాధించింది. తరువాత ఈ జట్టు దాదాపుగా ప్రతి సీజన్లోనూ ప్లే ఆఫ్స్కు చేరుకుంటోంది. వార్నర్ సారథ్యంలో హైదరాబాద్ జట్టు విన్ పర్సంటేజ్ 55.3 శాతంగా ఉంది.
విరాట్ కోహ్లి (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)
విరాట్ కోహ్లి కెప్టెన్గా టీమిండియాను విజయాల బాట పట్టించినా ఆర్సీబీ జట్టును మాత్రం అగ్ర పథంలో నిలపలేకపోతున్నాడు. కోహ్లి 110 మ్యాచ్లలో ఆర్సీబీకి నాయకత్వం వహించగా.. అతని సారథ్యంలో జట్టు విన్ పర్సంటేజ్ 44.5 శాతంగా ఉంది.
రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్)
ఐపీఎల్లో రోహిత్ శర్మ మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా నిలిచాడు. ఇతని ఆధ్వర్యంలో ముంబై జట్టు ఏకంగా 4 ఐపీఎల్ టైటిల్స్ను సాధించింది. ఈ జట్టుకు రోహిత్ 104 మ్యాచ్లలో నాయకత్వం వహించగా.. ఇతని సారథ్యంలో ఈ జట్టు విన్ పర్సంటేజ్ 57.7 శాతంగా ఉంది.
దినేష్ కార్తీక్ (కోల్కతా నైట్ రైడర్స్)
గౌతం గంభీర్ అనంతరం కేకేఆర్ జట్టుకు నాయకత్వ బాధ్యతలు చేపట్టిన దినేష్ కార్తీక్ అంతగా సక్సెస్ అవలేదు. ఇతని సారథ్యంలో ఆ జట్టు 36 మ్యాచ్ లు ఆడగా, విన్ పర్సంటేజ్ 47.2 శాతంగా ఉంది.
శ్రేయాస్ అయ్యర్ (ఢిల్లీ క్యాపిటల్స్)
గౌతం గంభీర్ నుంచి కెప్టెన్సీ తీసుకున్న అయ్యర్ ఫర్వాలేదనిపించాడు. 2012 తరువాత తొలిసారిగా గతేడాది ఈ జట్టు ప్లే ఆఫ్స్కు వెళ్లింది. అయ్యర్ ఢిల్లీకి 24 మ్యాచ్లలో కెప్టెన్గా వ్యవహరించగా.. ఇతని సారథ్యంలో ఆ జట్టు విన్ పర్సంటేజ్ 54.2 శాతంగా ఉంది.
స్టీవ్ స్మిత్ (రాజస్థాన్ రాయల్స్)
స్టీవ్ స్మిత్ నిజానికి చాలా తక్కువ మ్యాచ్లో రాజస్థాన్కు కెప్టెన్గా వ్యవహరించాడు. అయితే ఐపీఎల్లో ధోనీ, రోహిత్ల తరువాత ఇతనే ఉత్తమ కెప్టెన్గా నిలుస్తాడనడంలో అతిశయోక్తి లేదు. స్మిత్ రాజస్థాన్కు 29 మ్యాచ్లలో కెప్టెన్గా ఉండగా, ఇతని సారథ్యంలో ఆ జట్టు విన్ పర్సంటేజ్ 65.5 శాతంగా ఉంది.
కేఎల్ రాహుల్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్)
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్కు రాహుల్ మొదటిసారి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టబోతున్నాడు. ఇతర టీంలలా పంజాబ్కు నిజానికి ఇప్పటి వరకు సమర్థవంతమైన నాయకుడు లేడు. అందువల్లే పంజాబ్ టీం ఐపీఎల్లో వరుసగా విఫలమవుతోంది. అయితే ఈసారైనా కేఎల్ రాహుల్ సారథ్యంలో ఐపీఎల్ టైటిల్ సాధించాలని పంజాబ్ టీం ఆలోచిస్తోంది.