రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రాధే శ్యామ్’. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో చిత్రీకరణ ప్రారంభించబోతుండగా ముందు ప్రభాస్ పూజా హెగ్డే ల మీద కీలక సన్నివేశాలను షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.
పూజా హెగ్డే కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకుందని తాజా సమాచారం. ఇక ఈ సినిమాలో పూజా మ్యూజిక్ టీచర్ గా కనిపించబోతుండగా .. ప్రభాస్, పూజా ల మద్య ఉండే లవ్ ట్రాక్ హైలెట్ గా నిలవబోతుందని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో సీనియర్ నటి భాగ్యశ్రీ కీలక పాత్రలో కనిపించనుండగా .. ప్రభాస్, భాగ్యశ్రీ ల మీద ఉండే సీన్స్ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయంటున్నారు.
కాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకి వచ్చింది. ‘రాధే శ్యామ్’ సినిమాలో తమిళ్ యంగ్ హీరో అథర్వా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడని.. అథర్వా, ప్రభాస్ కి తమ్ముడి పాత్రలో కనిపిస్తాడని తాజా సమాచారం. ఇక లాక్ డౌన్ కి ముందు జార్జియాలో చిత్రీకరణ జరిపిన టీమ్ కరోనా కారణంగా షూటింగ్ నిలిపివేసి ఇండియాకు తిరిగివచ్చేశారు. వచ్చే నెల నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో మిగిలిన షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయనున్నారట.
ఈ లాక్ డౌన్ సమయంలో కూడా చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కంప్లీట్ చేశారట. తెలుగుతో, హిందీలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇతర భాషల్లోకి డబ్ చేయనున్నరు. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో నడిచే రొమాంటిక్ ఎంటెర్టైనర్ తెరకెక్కుతుంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!