ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నారు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. కీలక పాత్రలో రాం చరణ్ నటిస్తున్నాడు. అయితే వరసగా సినిమా చేయాలనుకున్న చిరంజీవి కొందరు యంగ్ డైరెక్టర్స్ ని లైన్ లో పెట్టుకున్నారు. కాని కరోనా కారణంగా ఆ సినిమాలన్ని నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ కానున్నాయట.
అయితే ఆచార్య తర్వాత మాత్రం మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ తెలుగు రిమేక్ లో నటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి స్క్రిప్ట్ వర్క్ చివరి దశకు చేరుకుందని సమాచారం. సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కించనుండగా చరణ్, చిరంజీవి ల సలహాల మేరకు స్క్రిప్ట్ లో మార్పులు చేశడట. ప్రస్తుతం డైలాగ్ వర్షన్ జరుగుతోందట. ఇక ఈ సినిమాలో నటించే నటీ, నటుల గురించి రక రకాల పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ క్రమంలోనే లూసిఫర్ లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆ వార్తలో నిజం లేదని తేలిపోయింది. తాజాగా విలన్ పాత్ర కోసం ఓ క్రేజీ నటుడి పేరు తెరపైకి వచ్చింది. ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్న వార్తలను బట్టి ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీ రోల్ లో నటిస్తున్నాడట.
ఇప్పటికే బాలీవుడ్ లో పలు సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి మంచి పేరు దక్కించుకున్న సంజయ్, ప్రస్తుతం కెజిఎఫ్ 2లో అధీర అనే విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఒరిజినల్ వెర్షన్ అయిన లూసిఫర్ లో వివేక్ ఓబెరాయ్ విలన్ గా నటించగా తెలుగులో అదే పాత్రకు సంజయ్ దత్ పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో అధికారకంగా వెల్లడి కావాల్సింది.