తరచుగా ఎక్కువ మందిలో వేధించే సమస్యలో బీపీ లేక షుగర్ ఉంటాయి. ఆధునిక జీవినశైలితో షుగర్ పేషెంట్ల సంఖ్య పెరిగిపోతోంది. ప్రపంచంలో అత్యధిక పేషెంట్లను ఇబ్బంది పెడుతున్న సమస్య మధుమేహం. ఈ ఆధునిక జీవనశైలిలో మార్పులు, పని ఒత్తిడి, ఇతరత్రా విషయాల వల్ల డయాబెటిస్ మనల్ని బానిసను చేసుకుంటోంది. అయితే తరుచుగా చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే డయాబెటిస్ను మన దరి చేయనీకుండా చేయగలమని న్యూజిలాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
విటమిన్ సి యొక్క యాంటీఆక్సిడెంట్ గుణాలు డయాబెటిస్ ఉన్నవారిలో అధిక స్థాయిలో ఫ్రీ రాడికల్స్ను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. అధిక రక్తపోటు వంటి అనేక సాధారణ కామోర్బిడిటీలకు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. విటమిన్ సి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల రోజంతా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం ద్వారా మధుమేహ వ్యాధిగ్రస్తులకు సహాయపడుతుంది అని ఒక అధ్యయనం కనుగొంది. డయాబెటిస్ , ఊబకాయం, జీవక్రియ జర్నల్లో ప్రచురితమైన ఈ పరిశోధనలో టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో విటమిన్ సి రక్తపోటును తగ్గిస్తుందని, గుండె ఆరోగ్యానికి కూడా ప్రయోజనాలను సూచిస్తుందని కనుగొన్నారు.
ఏడాది చలికాలంలోకి అడుగుపెట్టాం. దీంతో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే కొంత వ్యాయమం చేయడంతో పాటు డైట్ పాటించడం కూడా చాలా ముఖ్యం. అందుకే చలికాలంలో దొరికే కొన్ని పండ్లను మీ డైట్లో భాగంగా చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి. బీపీ, షుగర్ లెవల్స్ తగ్గించడానికి దోహదపడే ఐదు రకాల పండ్లు నారింజ, ఆపిల్, బత్తాయి కివి, స్ట్రాబెర్రీ వీటిని ఎక్కువగా తీసుకోవాలి.
ప్రతిరోజూ భోజనం చేసిన అనంతరం ఓ పది నుంచి పదిహేను నిమిషాలు నడిస్తే రక్తంలోని షుగర్ లెవెల్స్ భారీగా తగ్గుతాయని గుర్తించారు.అందుకే ప్రతిరోజూ వాకింగ్ చేస్తే రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గి మధుమేహానికి దూరంగా ఉంటామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.